Telangana CM: తెలంగాణను చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు..
- ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సూచనలు..
- 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. అందులో మాకు 45 టీఎంసీలు రావాలి..
- పాలమూరు రంగారెడ్డికి నీళ్ల కేటాయింపులు కావాలంటే.. ఇవ్వడం లేదు..
- తెలంగాణను చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. దాంట్లో మాకు 45 టీఎంసీలు రావాలని డిమాండ్ చేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్ళ కేటాయింపులు కావాలి అంటే ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించారు. మా ప్రాజెక్టులకు ఎన్ఓసీ ఇవ్వండి అన్నారు. నికర జలాల వాడుకుంటాం అంటే మీరు అభ్యంతరం చెప్తున్నారు.. వరద జలాల మీద మాత్రం మీరు మాపై కోట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. చంద్రబాబు మేల్కొని.. తెలంగాణనీ ఇరకటంలోకి నెట్టిండు.. చంద్రబాబు వచ్చినా.. జగన్ వచ్చినా.. గోదావరి నీళ్లు తీసుకు పోతామన్నారు.. దీనికి కేంద్రం కూడా పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా సార్లు మేము కిషన్ రెడ్డినీ అడిగాం.. అధికారులను పంపి వివరాలు ఇచ్చాం.. కానీ, కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి మనుగడ తేవాలని కిషన్ రెడ్డి చూస్తున్నారు.. అంతరించిపోతున్న బీఆర్ఎస్ కి పునరుజ్జీవం పోయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు.
Read Also: CM Revanth Reddy: తెలంగాణకు శాపంగా మారిన బీఆర్ఎస్ నిర్ణయాలు..
Also Read
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
- Jagadish Reddy: సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి కౌంటర్
- Jagga Reddy : బీఆర్ఎస్ నేతలకు జగ్గారెడ్డి సవాల్.. కేసీఆర్, హరీష్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.!
అయితే, ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ కుట్రను చెప్పండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మన నోటి హక్కులు తాకట్టు పెట్టింది కేసీఆర్.. కేసీఆర్ ఫ్యామిలీ అంతా అబద్దాల మీద బతుకుతున్నారు.. వాళ్ళ సక్సెస్ సీక్రెట్ కూడా అబద్ధాలు చెప్పడమే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సచ్చిన పాము.. బీజేపీ మీద ఫోకస్ పెట్టండి.. కమలం పార్టీని, కేసీఆర్ నీ బతికించే పనిలో కిషన్ రెడ్డి ఉన్నారు.. ఆయన మాట్లాడే ప్రతి మాట.. కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోట్ అని ఆరోపించారు. మేము కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్తే.. ఎప్పుడూ మమ్మల్ని కేంద్రం దగ్గరికి తీసుకుపోలేదన్నారు. కిషన్ రెడ్డి తీరు అనుమానాలు కలిగిస్తున్నాయి.. ఇక, బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకి శుభాకాంక్షలు.. గోదావరి నదీ జలాల సమస్యను మోడీ దృష్టికి తీసుకెళ్లండి అని సూచించారు. మీ మొదటి కార్యాచరణ ఇదే పెట్టుకోండి అన్నారు. మా అధికారులు మీకు సమాచారం ఇస్తారు.. వాళ్ళు ఇచ్చే సోషల్ మీడియా ప్రకటనలు చూసి కన్ఫ్యూజ్ అవ్వొదు.. తప్పులు చేసింది వాళ్ళే.. వాటిని కప్పి పుచ్చుకునే పనిలో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ తో పంచాయతీ కంటే.. తెలంగాణ హక్కులు సాధించుకోవడం ఎలా అనేదే మా లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..