Telangana CM: తెలంగాణను చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు..
- ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సూచనలు..
- 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. అందులో మాకు 45 టీఎంసీలు రావాలి..
- పాలమూరు రంగారెడ్డికి నీళ్ల కేటాయింపులు కావాలంటే.. ఇవ్వడం లేదు..
- తెలంగాణను చంద్రబాబు ఇరకాటంలోకి నెట్టారు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana CM: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. 90 టీఎంసీలు పట్టిసీమకు తీసుకెళ్లారు.. దాంట్లో మాకు 45 టీఎంసీలు రావాలని డిమాండ్ చేశారు. ఇక, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకి నీళ్ళ కేటాయింపులు కావాలి అంటే ఇవ్వడం లేదు.. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు అని ప్రశ్నించారు. మా ప్రాజెక్టులకు ఎన్ఓసీ ఇవ్వండి అన్నారు. నికర జలాల వాడుకుంటాం అంటే మీరు అభ్యంతరం చెప్తున్నారు.. వరద జలాల మీద మాత్రం మీరు మాపై కోట్లాడుతున్నారు అని పేర్కొన్నారు. చంద్రబాబు మేల్కొని.. తెలంగాణనీ ఇరకటంలోకి నెట్టిండు.. చంద్రబాబు వచ్చినా.. జగన్ వచ్చినా.. గోదావరి నీళ్లు తీసుకు పోతామన్నారు.. దీనికి కేంద్రం కూడా పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా సార్లు మేము కిషన్ రెడ్డినీ అడిగాం.. అధికారులను పంపి వివరాలు ఇచ్చాం.. కానీ, కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీకి మనుగడ తేవాలని కిషన్ రెడ్డి చూస్తున్నారు.. అంతరించిపోతున్న బీఆర్ఎస్ కి పునరుజ్జీవం పోయాలని కిషన్ రెడ్డి చూస్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు.
Read Also: CM Revanth Reddy: తెలంగాణకు శాపంగా మారిన బీఆర్ఎస్ నిర్ణయాలు..
Also Read
- CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
- Telangana High Court : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్పై స్టే ఎత్తివేత.. కానీ..!
- CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
- CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
అయితే, ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ కుట్రను చెప్పండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మన నోటి హక్కులు తాకట్టు పెట్టింది కేసీఆర్.. కేసీఆర్ ఫ్యామిలీ అంతా అబద్దాల మీద బతుకుతున్నారు.. వాళ్ళ సక్సెస్ సీక్రెట్ కూడా అబద్ధాలు చెప్పడమే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సచ్చిన పాము.. బీజేపీ మీద ఫోకస్ పెట్టండి.. కమలం పార్టీని, కేసీఆర్ నీ బతికించే పనిలో కిషన్ రెడ్డి ఉన్నారు.. ఆయన మాట్లాడే ప్రతి మాట.. కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోట్ అని ఆరోపించారు. మేము కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్తే.. ఎప్పుడూ మమ్మల్ని కేంద్రం దగ్గరికి తీసుకుపోలేదన్నారు. కిషన్ రెడ్డి తీరు అనుమానాలు కలిగిస్తున్నాయి.. ఇక, బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకి శుభాకాంక్షలు.. గోదావరి నదీ జలాల సమస్యను మోడీ దృష్టికి తీసుకెళ్లండి అని సూచించారు. మీ మొదటి కార్యాచరణ ఇదే పెట్టుకోండి అన్నారు. మా అధికారులు మీకు సమాచారం ఇస్తారు.. వాళ్ళు ఇచ్చే సోషల్ మీడియా ప్రకటనలు చూసి కన్ఫ్యూజ్ అవ్వొదు.. తప్పులు చేసింది వాళ్ళే.. వాటిని కప్పి పుచ్చుకునే పనిలో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ తో పంచాయతీ కంటే.. తెలంగాణ హక్కులు సాధించుకోవడం ఎలా అనేదే మా లక్ష్యమని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తాజావార్తలు
-
FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
-
Rambha Urvashi Menaka Trailer: నవ్వులు పూయిస్తున్న అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్.. చూశారా!
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!