BC Reservations: నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ!
- నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ..
- స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషన్..
- సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం..
- తెలంగాణ ప్రభుత్వం, ఈసీ తరఫున వాదనలు వినిపించనున్న అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చింది. ఇక, దీనిపై హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబరు 29వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. దీంతో ఈరోజు ( అక్టోబర్ 6న) బీసీ రిజర్వేషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేయనుంది.
Read Also: Sreeleela : సౌత్ క్యూటీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ ప్రాజెక్ట్లో శ్రీలీల
Also Read
- Hyderabad: పెద్ద కొడుకు జైల్లో.. చిన్న కుమారుడు గంజాయి బానిస.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
- Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
- Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. "డ్రైవర్నే చంపుకోండి" అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
- HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
అయితే, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకుంది. గత రాత్రి బీసీ మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి.. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించనున్నారు.
Read Also: Krithi Shetty: బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోబోతున్న కృతి శెట్టి
ఇక, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీవ్ర వివాదం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంతకుముందు న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, దాన్ని ఉల్లంఘించిన తెలంగాణ ప్రభుత్వం, బీసీలకు ఏకంగా 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వడంతో, వారికి 50 శాతం మించిపోతుంది. కాబట్టి, ఇప్పుడు కోర్టు తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ మార్పులు జరిగే అవకాశం ఉందనే విషయం క్లియర్ గా తెలుస్తుంది.
తాజావార్తలు
-
Amaravati Land Pooling Case: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్.. రాజకీయ పోరాటాలు కోర్టులో వద్దు..!
-
NBK112 : బాలయ్య – కొరటాలశివ సినిమా ఆగిందా.. పుకార్లలో వాస్తవం ఎంత?
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Ampere Magnus G Max: 30కి పైగా కొత్త ఫీచర్లతో అప్డేట్ అయిన Ampere Magnus G Max.. 142km రేంజ్, ధర ఎంతంటే?
-
Survey: అమెరికా, శ్రీలంక నుంచి పాక్ వరకు.. భారత్ను ప్రేమించేది ఎవరు? ద్వేషించేది ఎవరు? సర్వేలో సంచలన నిజాలు..
ట్రెండింగ్
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!
-
Indoor Plants: ఒక్క గ్లాస్ నీటితో ఇంట్లో గ్రీన్ డెకరేషన్.. ఈ మొక్కలను ఇలా పెంచండి!
-
Termite-Proof Furniture: చెదల బెడదకు చెక్.. చెక్కకు బదులుగా ఈ మెటీరియల్స్ ఎంచుకోండంతే.!