BC Reservations: నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ!
- నేడు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణ..
- స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషన్..
- సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం..
- తెలంగాణ ప్రభుత్వం, ఈసీ తరఫున వాదనలు వినిపించనున్న అభిషేక్ సింఘ్వీ, సిద్ధార్థ దవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservations: తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును తీసుకొచ్చింది. ఇక, దీనిపై హైకోర్టు స్థానిక ఎన్నికలపై ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సెప్టెంబరు 29వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటూ పేర్కొన్నారు. దీంతో ఈరోజు ( అక్టోబర్ 6న) బీసీ రిజర్వేషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేయనుంది.
Read Also: Sreeleela : సౌత్ క్యూటీకి బాలీవుడ్ బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ ప్రాజెక్ట్లో శ్రీలీల
Also Read
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
- Hyderabad: ప్రేమిస్తున్న యువకుడు మాట్లాడటం లేదని మనస్తాపం.. మైనర్ బాలిక ఆత్మహత్య.!
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- CM Revanth Reddy : సీఎం రేవంత్ బిగ్ ప్లాన్.. స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి మేకోవర్.!
అయితే, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వ వాదనలను గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకుంది. గత రాత్రి బీసీ మంత్రులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం, పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వి.. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదించనున్నారు.
Read Also: Krithi Shetty: బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకోబోతున్న కృతి శెట్టి
ఇక, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీవ్ర వివాదం కొనసాగుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంతకుముందు న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, దాన్ని ఉల్లంఘించిన తెలంగాణ ప్రభుత్వం, బీసీలకు ఏకంగా 42 శాతం రిజర్వేషన్ల ఇవ్వడంతో, వారికి 50 శాతం మించిపోతుంది. కాబట్టి, ఇప్పుడు కోర్టు తీర్పు ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్లీ మార్పులు జరిగే అవకాశం ఉందనే విషయం క్లియర్ గా తెలుస్తుంది.
తాజావార్తలు
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
-
Jani Master: ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం.. జానీ మాస్టర్కు ఊహించని షాక్!
-
Hombale Films: ‘కేజీఎఫ్’ నుంచి ‘మహా అవతార్’ వరకు.. హోంబలే ఫిల్మ్స్ భారీ ప్లాన్తో ఇండియన్ సినిమాకు కొత్త దిశ
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!