Atrocious: మొన్న షాద్నగర్.. నేడు మైలార్ దేవపల్లి.. తండ్రులపై కొడుకుల అఘాయిత్యాలు..
- హైదరాబాద్ లోని మైలార్దేవపల్లీ లో దారుణం..
- 4 లక్షల రూపాయల కోసం తండ్రిని చంపిన కసాయి కొడుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: కుటుంబాలపై ప్రేమ తగ్గుతుంది. ఇప్పుడు అందరికి కావాల్సింది మణి. డబ్బు వుంటేనే ఏదైనా. బతకడానికి కష్టపడ కుండా చేతిలో మణి వుంటే దునియాన్నే ఏలేయొచ్చనే ఆశ. చేతిలో పైసా ఉంటే జీవితాన్ని ఆనందంగా గడిపేయొచ్చు. ఇది అందరిలో ఉండే ఆలోచన. అంతేకాదు.. ఈ డబ్బు కోసం ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. దీనికి ఉదాహరణ మొన్న షాద్ నగర్ లో జరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణకు ఆస్తికోసం కన్న కొడుకులే కిరాతకంగా హత్య చేయగా నేడు మైలార్ దేవపల్లిలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. రూ.4 లక్షల కోసం కన్న తండ్రిని దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో సంచలనంగా మారింది.
Read also: Crime News: దారుణం.. 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి యువకుడు అత్యాచారం
Also Read
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Pawan Kalyan: పవన్ కల్యాణ్కు తెలంగాణ పోలీసుల షాక్.. నో పర్మిషన్..
మైలార్ దేవపల్లిలోని ప్రగతి కాలనీలో కిష్టప్ప అనే వ్యక్తి కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అతనికి మహేందర్ అనే కొడుకు వున్నాడు. వీరి కుటుంబంలో డబ్బు చిచ్చుపెట్టింది. తండ్రిని కొడుకు డబ్బులు అడగటంతో తండ్రి నిరాకరించాడో ఏమో తెలియదు కానీ.. తండ్రిని అతికిరాతకంగా హత్య చేశాడు కొడుకు. తండ్రి నిద్రిస్తుండగా గదిలోకి వెళ్లిన కొడుకు తండ్రి కిష్టప్పను కొడుకు మహేందర్ పక్కనే వున్న దిండును తీసుకుని తండ్రి మొఖంపై పెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. దీంతో కిష్టప్ప ఊపిరి ఆడక నరకయాతన అనుభవించాడు. చివరకు ప్రాణాలు విడిపెట్టాడు. తండ్రి చనిపోవడంతో బీరువాలో వున్న రూ. 4 లక్షలను తీసుకుని ఏమీ తెలియనట్లు తండ్రి చనిపోయాడని ముసలి కన్నీరు కార్చాడు. అయితే అక్కడే వున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. కొడుకుపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తండ్రి కిష్టప్ప గదిలో వున్నప్పుడు భార్య ఏం చేస్తుంది? అసలు డబ్బులు గురించి తండ్రి కొడుకుల మద్య ఎందుకు గొడవ మొదలైంది అనేది ఇంకా తెలియరాలేదు. రూ. 4 లక్షల కోసం తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేశాడు. రూ. 4 లక్షలు కిష్టప్ప దగ్గర ఎలా వచ్చాయి అనే దానిపై ఆరా తీస్తున్నారు.
Hyderabad Crime: ఎస్ ఆర్ నగర్ లో దారుణం.. హాస్టల్ లో యువకుడి హత్య..
తాజావార్తలు
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
Blast Zone : అంచనాలు లేకుండా వచ్చి అదరగొట్టిన యాక్షన్ కింగ్ అర్జున్ ‘బ్లాస్ట్’
-
Huawei Nova 16 Series: 200MP కెమెరా, 7000mAh బ్యాటరీతో.. హువావే నోవా 16 సిరీస్ రిలీజ్
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!