Crime News: అనకాపల్లిలో దారుణం జరిగింది. అనకాపల్లి పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతిని కిడ్నాప్ చేసి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తన స్నేహితులతో సింహాచలం వెళ్లి వస్తున్న యువతని కిడ్నాప్ చేసి అనకాపల్లి పట్టణంలోని హ్యాపీ హౌస్ ఫంక్షన్ హాల్లో అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. తను కూతురు కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కిడ్నాప్, అత్యాచారానికి పాల్పడిన తేజసాయికుమార్తో పాటు ఇతనికి సహకరించిన మరో ఐదుగురిని అనకాపల్లి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Israel–Hamas war: గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి.. ఏడుగురు పిల్లలతో సహా 30 మంది మృతి
అనకాపల్లి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అనకాపల్లికి చెందిన 19 ఏళ్ల యువతి ధర్మవరం అగ్రహారానికి చెందిన స్నేహితురాలు, మరో యువకుడితో కలిసి బైక్పై సింహాచలం వెళ్లారు. తిరిగి వస్తుండగా.. అనకాపల్లి మండలం శంకరం వద్ద కొత్తూరుకు చెందిన యువకుడు తేజసాయికుమార్ అడ్డగించి వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో అతని స్నేహితులు బి.శంకర్, ఎస్.పవన్, ఎం.హరీష్, వి.రామ్ శాంతారం, అభిలాష్ ఉన్నారు. గొడవ జరుగుతున్న సమయంలో అనకాపల్లికి చెందిన యువతి మనస్తాపానికి గురై ఏలేరు కాలువలో దూకింది. ఆమెను తేజసాయికుమార్ కాపాడి ఓ ఇంటికి తీసుకెళ్లాడు. ఆమెపై రాత్రి అత్యాచారం చేసినట్లు తెలిసింది. యువతి భయపడి తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. యువతి కనిపించకపోవడంతో 26న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారిస్తుండగా.. యువతి ఇంటికి చేరుకుంది. ఈ క్రమంలోనే జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తేజసాయికుమార్పై కిడ్నాప్, అత్యాచారం కేసును పోలీసులు నమోదు చేశారు. అతని స్నేహితులపై కిడ్నాప్ కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.