Police Firing Nampally: హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం..
- హైదరాబాదులో మరోసారి పోలీసు కాల్పుల కలకలం..
- ఐదవ సారి కాల్పులు జరిపి కలకలం సృష్టించిన సిటీ పోలీస్..
- నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించిన పోలీసులు..
- ఓ వ్యక్తి వద్ద ఉన్న గొడ్డలితో- మరో వ్యక్తి రాళ్లతో పోలీసుల పై దాడి..
- తప్పించుకునే ప్రయత్నంలో పోలీసుల కాల్పులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Firing Nampally: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున మరోసారి కాల్పుల కలకలం రేగింది. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఇద్దరు వ్యక్తులు పోలీసులపై గొడ్డలితో దాడికి యత్నించాడు.. మరోవ్యక్తి పోలీసులపై రాళ్లు విసిరాడు. తనిఖీలు చేస్తుండగా పోలీసులపై దాడికి యత్నించడంతో అప్రమత్తమై పోలీస్ డెకాయ్ టీం వెంటనే పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులకి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు వారిని వెంటనే ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాల్పుల్లో గాయపడ్డ వారిని అనీస్, రాజ్ గుర్తించారు. గాయపడ్డ వారితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు గాల్పుల్లో గాయపడ్డ వారు దోపిడి దొంగలుగా అనుమానిస్తున్న వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. నగరంలో ఐదవ సారి సిటీ పోలీసులు కాల్పులు జరిపడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆసుపత్రిలో కాల్పులకు గాయపడ్డ నిందితుడికి చికిత్స కొనసాగుతుంది. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో ఉస్మానియా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాలికి బుల్లెట్ తగలడంతో కొద్దిసేపటి క్రితమే బుల్లెట్ తొలగించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని , ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు చెలిపారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
కొద్ది రోజుల క్రితం ఎల్బీ నగర్ సమీపంలో పార్డి ముఠాపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. గత వారం హైదరాబాద్లో దొంగల ముఠాను పట్టుకునేందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది. నల్గొండ జిల్లా చిట్యాల వద్ద జాతీయ రహదారిపై కారులో నిద్రిస్తున్న దంపతులపై ముగ్గురు వ్యక్తులు కారు అద్దాలు పగులగొట్టి నగలు దోచుకెళ్లారు. అయితే ఈ క్రమంలో హయత్ నగర్ మీదుగా ఎల్బీనగర్ వైపు వెళ్తున్న ఆటోను నిందితులు ట్రాక్ చేశారు. ఎల్బీ నగర్ వద్ద వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై తిరగబడ్డారు. దీంతో నిందితుడిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది. తాజాగా నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!