Hyderabad: మూసీ నదిలోకి కెమికల్స్ డంపింగ్.. పోలీసులు అదుపులో నిందితుడు
- కెమికల్, ఫార్మా కంపెనీల వ్యర్థాలు మూసీ నదిలోకి డంపింగ్..
- లంగర్ హౌజ్లోని బాపూ ఘాట్ వద్ద అర్థరాత్రి రెండు ట్యాంకర్లను పట్టుకున్న స్థానికులు..
- వాటర్ ట్యాంకర్ల ముసుగులో రసాయన వ్యర్థాలు..
- బాల్నగర్, షాద్నగర్, కొత్తూరు ప్రాంతాల్లోని కంపెనీల నుంచి రసాయన వ్యర్థాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: కెమికల్, ఫార్మా కంపెనీల్లో వ్యర్థాలను గుట్టుచప్పుడు కాకుండా మూసీ నదిలోకి డంపింగ్ చేస్తున్నారు. లంగర్ హౌజ్లోని బాపూ ఘాట్ దగ్గర అర్ధరాత్రి రెండు ట్యాంకర్లను స్థానికులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. వాటర్ ట్యాంకర్ల ముసుగులో కెమికల్ వ్యర్థాలను మూసీలో డిస్పోజ్ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాల్ నగర్, షాద్ నగర్, కొత్తూరు ప్రాంతాల్లో ఉన్న కంపెనీల నుంచి ఈ వ్యర్థాలు వచ్చినట్లుగా గుర్తించారు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు సమాచారం.
Read Also: IPL 2025 Teams: ముగిసిన ఐపీఎల్ మెగా వేలం.. ఏ జట్టులో ఎవరెవరున్నారో తెలుసా?
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
అయితే, మూసీ కాలువ డిస్పోజ్ కోసం ప్రత్యేక మ్యాన్ హోల్ ను దుండగులు ఏర్పాటు చేసుకున్నారు. కంపెనీ నుంచి కెమికల్ ట్యాంకర్ బయల్దేరిన తర్వాత.. ప్రతీ పాయింట్ వద్ద డ్రైవర్లు మారుతున్నారు. అత్తాపూర్ దగ్గర ట్యాంకర్ ను రిసీవ్ చేసుకుంటున్న మరో డ్రైవర్, కంపెనీల ఏజెంట్లు.. డ్రైవర్లకు కూడా తెలియకుండా అక్రమ డంపింగ్ చేస్తున్నారు. స్థానిక ఇసుక రిచ్ నిర్వహకుడితో కలిసి తతంగం కొనసాగిస్తున్నారు. కెమికల్ ట్యాంకర్లు రాగానే అడ్డుగా ఇసుక, కంకర లారీలను పెడుతున్న వ్యక్తులు.. వెనక వైపు మ్యాన్ హోల్ ద్వారా కెమికల్ డంపింగ్ చేస్తున్నారు. రాత్రి కూడా అలాగే వచ్చిన ట్యాంకర్లను స్థానికులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఓ ట్యాంకర్ డ్రైవర్ తప్పించుకోగా.. మరో ట్యాంకర్ డ్రైవర్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ఫార్మా కంపెనీలు పెద్ద మాఫియా నడుపుతున్నాయని చెప్పుకొచ్చారు.
Read Also: Pushpa 2 Update: హమ్మయ్య.. ఓ పనైపోయింది! ఫాన్స్ రెడీ అయిపోండమ్మా
రాజేంద్రనగర్ సీఐ మాట్లాడుతూ.. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బాపు ఘాట్ వద్ద మూసీలోకి కెమికల్ వ్యర్థాలు కలిపే సమయంలో పట్టుకున్నారు. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకుని ట్యాంకర్ ను సీజ్ చేశాం.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు సమాచారం ఇచ్చాం.. ట్యాంకర్ షాద్ నగర్ పారిశ్రామిక వాడ నుండి వచ్చినట్లు తేలింది.. ట్యాంకర్ లో కెమికల్ వ్యర్ధాలను కలుపుతోంది ఎవరు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. మరో రెండు లారీలు పరార్ అయ్యాయి.. వాటిని కూడా పట్టుకుంటాం.. మూసీ నదిలోకి కెమికల్ వ్యర్ధాలు వదలడానికి ప్రత్యేకంగా మ్యాన్ హోల్ కూడా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మ్యాన్ హోల్ ఏర్పాటు చేసిన వ్యక్తిపై.. సహకరిస్తున్న ఇసుక రిచ్ వ్యక్తులపై కూడా కేసు నమోదు చేస్తామని రాజేంద్రనగర్ సీఐ క్యాస్ట్రో వెల్లడించారు.
తాజావార్తలు
-
Maharashtra: పొదుపు మంత్రం.. బైక్పై విధాన్ భవన్కు వెళ్లిన సీఎం ఫడ్నవిస్
-
IPL 2026: ప్లేఆఫ్స్ మిస్.. ఐపీఎల్లో ఈ ముగ్గురు కెప్టెన్లకు గండం!
-
MLA Ramakrishna Reddy: ప్రతి పౌరుడు పొదుపు చర్యలు పాటించాలి!
-
RAPO 23 : దర్శకుడుగా హీరో రామ్.. రేపు అధికారిక ప్రకటన.!
-
Tata Altroz iCNG AMT: టాటా ఆల్ట్రోజ్ iCNG AMT విడుదల.. సేఫ్ & స్మార్ట్ CNG అటోమేటిక్
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?