Raghunandan Rao: కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదు
- కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదు
- కౌంటర్ ఎటాక్ చేసిన ఎంపీ రఘునందన్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని ఆ పార్టీ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సామాజిక తెలంగాణ అని కవిత చెల్లెలు కొత్త నినాదం ఎత్తుకున్నదంటూ ఎద్దేవా చేశారు. 2014లో ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవులిచ్చారని.. ఆనాడు మీ నాన్నను ఎందుకు బీసీలకు పదవులు ఇవ్వలేదని అడగలేదు.? అని ప్రశ్నించారు. ఆనాడు సామాజిక న్యాయం ఎటు పోయిందని నిలదీశారు. అయినా తాటాకు చప్పుళ్లకు.. ఉడుత ఊపులకు బీజేపీ పార్టీ భయపడదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut : వయస్సు గురించి నాకు పట్టింపు లేదు..
Also Read
- Grain Storage Silos: తెలంగాణలో ధాన్యం నిల్వకు అత్యాధునిక సైలోలు.. రూ.4,450 కోట్లతో భారీ ప్రణాళిక.!
- Secunderabad: కంటోన్మెంట్లో బ్రిటిష్ పేర్లు తొలగింపు.. 21 రోడ్లు, 3 బజార్లకు వీర జవాన్లు, మహనీయుల నామకరణం!
- TG Registration Services: తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక ప్రకటన.. కారణం ఇదే..!
- CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
కవిత ఏం మాట్లాడారంటే..
బీజేపీ, కాంగ్రెస్కు జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీకి ఎనిమిది ఎంపీలు ఉంటే తెలంగాణ గురించి పార్లమెంట్లో ఒక్క అంశం గురించి మాట్లాడరని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్కు జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Naga Chandrika Rani: “మిస్ తెలుగు యూఎస్ఏ” కిరీటం సొంతం చేసుకున్న పోలవరం భామ..
కేసీఆర్కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే.. మరో కన్ను జాగృతి అని తెలిపారు. కేసీఆర్.. తెలంగాణ సోయితో పరిపాలన చేశారని.. మన ఖర్మేందంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి జై తెలంగాణ అని కూడా అనరన్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడైనా జై తెలంగాణ అనాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం పేరుతో కార్యక్రమం ఉండకూడదు.. రాజీవ్కు తెలంగాణతో ఏం సంబంధం ఉంది? అని అడిగారు. తెలంగాణ వాదుల పేరుతో పథకం పెట్టాలని కోరారు. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంతాచారి, యాదిరెడ్డి లాంటి వారి పేర్లు పెట్టాలన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా చేపడుతున్నట్లు చెప్పారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను ఎండగడతామన్నారు. బీసీ బిల్లును బీజేపీ డీ ఫ్రీజ్లో పెట్టే ప్రయత్నం చేస్తే జాగృతి తరపున మళ్లీ పోరాటం చేస్తామని ప్రకటించారు. విద్యార్థులు, మహిళలు, మైనార్టీల కోసం ఇచ్చిన హామీలపైన కూడా పోరాటం చేస్తామని కవిత వెల్లడించారు.
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?