Raghunandan Rao: కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదు
- కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదు
- కౌంటర్ ఎటాక్ చేసిన ఎంపీ రఘునందన్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ కవిత తాటాకు చప్పుళ్లకు బీజేపీ భయపడదని ఆ పార్టీ ఎంపీ రఘునందన్రావు అన్నారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీపై కవిత చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. సామాజిక తెలంగాణ అని కవిత చెల్లెలు కొత్త నినాదం ఎత్తుకున్నదంటూ ఎద్దేవా చేశారు. 2014లో ముగ్గురు బీసీ ఎమ్మెల్యేలకు మాత్రమే మంత్రి పదవులిచ్చారని.. ఆనాడు మీ నాన్నను ఎందుకు బీసీలకు పదవులు ఇవ్వలేదని అడగలేదు.? అని ప్రశ్నించారు. ఆనాడు సామాజిక న్యాయం ఎటు పోయిందని నిలదీశారు. అయినా తాటాకు చప్పుళ్లకు.. ఉడుత ఊపులకు బీజేపీ పార్టీ భయపడదని తెలిపారు.
ఇది కూడా చదవండి: Kangana Ranaut : వయస్సు గురించి నాకు పట్టింపు లేదు..
Also Read
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
- HYDRA Ranganath: నేను చట్టపరిధిలోనే పనిచేస్తున్నా, పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తి లేదు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
కవిత ఏం మాట్లాడారంటే..
బీజేపీ, కాంగ్రెస్కు జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని కవిత ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీజేపీకి ఎనిమిది ఎంపీలు ఉంటే తెలంగాణ గురించి పార్లమెంట్లో ఒక్క అంశం గురించి మాట్లాడరని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్కు జాగృతి సత్తా ఏంటో రాబోయే రోజుల్లో చూపిస్తామని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Naga Chandrika Rani: “మిస్ తెలుగు యూఎస్ఏ” కిరీటం సొంతం చేసుకున్న పోలవరం భామ..
కేసీఆర్కు బీఆర్ఎస్ ఒక కన్ను అయితే.. మరో కన్ను జాగృతి అని తెలిపారు. కేసీఆర్.. తెలంగాణ సోయితో పరిపాలన చేశారని.. మన ఖర్మేందంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి జై తెలంగాణ అని కూడా అనరన్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడైనా జై తెలంగాణ అనాలని డిమాండ్ చేశారు. రాజీవ్ యువ వికాసం పేరుతో కార్యక్రమం ఉండకూడదు.. రాజీవ్కు తెలంగాణతో ఏం సంబంధం ఉంది? అని అడిగారు. తెలంగాణ వాదుల పేరుతో పథకం పెట్టాలని కోరారు. తెలంగాణ కోసం అమరులైన శ్రీకాంతాచారి, యాదిరెడ్డి లాంటి వారి పేర్లు పెట్టాలన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంపై జూన్ 4న జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు దగ్గర మహాధర్నా చేపడుతున్నట్లు చెప్పారు.
కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలను ఎండగడతామన్నారు. బీసీ బిల్లును బీజేపీ డీ ఫ్రీజ్లో పెట్టే ప్రయత్నం చేస్తే జాగృతి తరపున మళ్లీ పోరాటం చేస్తామని ప్రకటించారు. విద్యార్థులు, మహిళలు, మైనార్టీల కోసం ఇచ్చిన హామీలపైన కూడా పోరాటం చేస్తామని కవిత వెల్లడించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!