MLC Kavitha: కేసీఆర్ను నిందించడానికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెప్తున్నారు..
- కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..
- టక్క టమార విద్యలన్నీ ప్రదర్శించి.. బీఆర్ఎస్ కంటే ఒక్కశాతం ఎక్కువ ఓటింగ్ తో గెలిచారు..
- కేసీఆర్ను నిందించడానికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెప్తున్నారు: ఎమ్మెల్సీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: శాసన మండలిలో బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. కేవలం కేసీఆర్ ని నిందించడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్ధాలు చెబుతున్నారు.. అబద్దాల విషయంలో ముఖ్యమంత్రికి గిన్నిస్ రికార్డు వస్తుందని పేర్కొన్నారు. సీఎం, మంత్రులు అబద్ధాలు చెప్పడం మానకపోతే సభలో ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాం.. 420 హామీలు ఇచ్చి, గాంధీ కుటుంబాన్ని తీసుకొచ్చి సంతకాలు పెట్టిచ్చి.. గ్యారంటీలు ఇప్పిచ్చి.. ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకున్నారు.. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేసింది. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించలేదన్నారు. రేవంత్ రెడ్డి సచివాలయానికి చుట్టపు లాగా వచ్చిపోతున్నారు.. ప్రజావాణీ వింటానని చెప్పి కేవలం ఒక్కసారి మాత్రమే ఆ కార్యక్రమానికి వచ్చారు.. ప్రజల్ని రోజూ కలుస్తానని చెప్పినా ముఖ్యమంత్రి అసలు ప్రజలను కలవడానికి ఇష్టపడడం లేదు.. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారు అని ఎమ్మెల్సీ కవిత మండిపడింది.
Read Also: IPL 2025 SRH: ఈ అడ్డంకులను దాటుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించేనా?
Also Read
ఇక, కాంగ్రెస్ పార్టీ మార్కు కరప్షన్ కి, కన్నింగ్ నెస్ కి నిదర్శనం ఈ బడ్జెట్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. అవినీతి కాంగ్రెస్ డిఎన్ఎ లో భాగం.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి విజన్ లేదు.. కేవలం కేసీఆర్ ని తిట్టడమే పనిగా పెట్టుకుని పరిపాలన చేస్తుంది.. ఉద్యమ కాలంలో కేసీఆర్ ని లక్షల తిట్లు తిట్టినా అవి ఆశీర్వాదాలుగా మారాయి.. కేసీఆర్ హయాంలో అప్పులపై కాంగ్రెస్ పార్టీ పదే పదే దుష్ప్రచారం చేస్తుంది.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అబద్ధమని బడ్జెట్ ద్వారా తేలిపోయింది.. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడి చేసిన అప్పులు కేవలం రూ. 3 లక్షల కోట్లు మాత్రమే.. ఆయా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీల మొత్తం కేవలం రూ. లక్షా 21 వేల కోట్లు మాత్రమే అని పేర్కొన్నారు. అంటే మొత్తం బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు రూ. 4 లక్షల 22 వేల కోట్లు మాత్రమే.. ఈ లెక్కలను బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వమే తెలిపింది.. మరి కాంగ్రెస్ పార్టీ అప్పులపై పదేపదే ఎందుకు అబద్ధాలు చెబుతుంది? అని కవిత ప్రశ్నించింది.
Read Also: Robinhood: #Grok ముహూర్తం కలిసి రాలేదు.. రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్ వాయిదా!
అయితే, రాష్ట్రానికి చోధక శక్తిగా పని చేయాల్సిన ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రం దివాళా తీసిందని ప్రకటించడంతో ప్రజల గుండెలకు గుబేలుమనవా అని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. పెట్టుబడిదారులకు, ప్రజలకు విశ్వాసం కల్పించాల్సింది పోయి ఈ రకంగా సీఎం మాట్లాడటం దారుణం.. బీఆర్ఎస్ హయాంలో మూలధన వ్యయం కింద ఏటా దాదాపు 43 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం.. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కేవలం మూలధన వ్యయంగా కేవలం రూ. 33 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.. అంటే దాదాపు నెలకు రూ. 2700 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తూ.. సీఎం ఏమో 500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని అబద్ధాలు చెబుతున్నారు.. కీలకమైన ఇరిగేషన్ రంగానికి కేవలం 7.5 శాతం మాత్రమే కేటాయింపులు చేసి ప్రాజెక్టులను ముందుకు సాగకుండా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రైతాంగం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇది నిదర్శనం.. ప్రాణాహిత చేవెళ్ల ప్రాజెక్టు 148 ఎఫ్ఆర్ఎల్ వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే కేవలం 44 టీఎంసీలు మాత్రమే నీటి లభ్యత ఉండేది.. 152 ఎఫ్ ఆర్ ఎల్ తో అయితే 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ ఆలోచించకుండా కాలువలు తవ్వడం మొదలు పెట్టారు అని కవత మండిపడింది.
తాజావార్తలు
-
Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు… ఓటీటీ డీల్ 100 కోట్లు?..
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!