Minister Ponguleti: రౌడీయిజం సరికాదు.. కట్టడి చేయండి
- సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరం..
- స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేపర్లు విసిరేసిన తీరు దారుణం
Minister Ponguleti: సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దళితెడూర స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. రౌడీయిజం చేయడం సరికాదన్నారు. దీన్ని కట్టడి చేయాలన్నారు. ఒక ఎమ్మెల్యే కేసు గురించి ఇలా చేయడం సరికాదన్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరేయడం కరెక్ట్ కాదన్నారు. ఇది స్పీకర్ కు అవమానించడమే అన్నారు. సభ అనంతరం చాంబర్కు పిలుస్తానని స్పీకర్ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించడం బాధాకరం అన్నారు.
Read also: Harish Rao Vs Speaker: ఒక సభ్యుని కోసం సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు
Also Read
- Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు
- Singareni : సింగరేణి చరిత్రలో మైలురాయి.. రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.!
- Chit Fund Fraud: చిట్ ఫండ్ పేరుతో భారీ మోసం.. ఏకంగా రూ.2 కోట్ల స్కాం
- B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
మరోవైపు మంత్రులు అసెంబ్లీలో లేరని మాజీ మంత్రి హరీశ్ రావు అనడం అన్యాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను సభలో ఉన్నానని.. నేను మంత్రినేనని గమనించాలని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2020 ఆర్ఓఆర్ చట్టం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతులందరికీ భరోసా కల్పించేందుకు కొత్త చట్టం తెస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్ఓఆర్ 2024 చట్టంపై సభలో మాట్లాడారు.
Read also: KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదు..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరికంలోనూ ఉండేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే అమాయకులు శిక్ష అనుభవిస్తారని అన్నారు. సిద్దిపేట జిల్లాలో ధరణి తప్పుడు రికార్డుతో మద్దెల కిష్టయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. గత హయాంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలకు చెందిన వేలాది ఎకరాల భూములను ధర్నాలు తీసుకొచ్చి లాక్కెళ్లారని ఆరోపించారు. తాము తీసుకువస్తున్న భూభారతి నిజమైన ప్రజల చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Maheshwar Reddy: కేసీఆర్ పేదల భూములు లాక్కున్నారన్న కాంగ్రెస్.. లాభ పడింది ఎవరో చెప్పడం లేదు..
తాజావార్తలు
-
Assembly Elections Results 2026: రిజల్ట్ డే.. తమిళనాడు, బెంగాల్ ఫలితాలపైనే ఉత్కంఠ..
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!