Minister Ponguleti: రౌడీయిజం సరికాదు.. కట్టడి చేయండి
- సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరం..
- స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేపర్లు విసిరేసిన తీరు దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponguleti: సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దళితెడూర స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. రౌడీయిజం చేయడం సరికాదన్నారు. దీన్ని కట్టడి చేయాలన్నారు. ఒక ఎమ్మెల్యే కేసు గురించి ఇలా చేయడం సరికాదన్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరేయడం కరెక్ట్ కాదన్నారు. ఇది స్పీకర్ కు అవమానించడమే అన్నారు. సభ అనంతరం చాంబర్కు పిలుస్తానని స్పీకర్ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించడం బాధాకరం అన్నారు.
Read also: Harish Rao Vs Speaker: ఒక సభ్యుని కోసం సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు
Also Read
- CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
- Harish Rao : రేవంత్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్.. ‘నిరూపిస్తే రాజీనామా.!’
- CM Revanth Reddy : జగ్గారెడ్డి లాంటి నాయకుడు వెయ్యి కోట్లు ఇచ్చినా దొరకడు
- CM Revanth Reddy : 70 వేల జాబ్స్ భర్తీ.. పేపర్ లీకేజీలపై బీఆర్ఎస్కు రేవంత్ కౌంటర్.!
మరోవైపు మంత్రులు అసెంబ్లీలో లేరని మాజీ మంత్రి హరీశ్ రావు అనడం అన్యాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను సభలో ఉన్నానని.. నేను మంత్రినేనని గమనించాలని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2020 ఆర్ఓఆర్ చట్టం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతులందరికీ భరోసా కల్పించేందుకు కొత్త చట్టం తెస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్ఓఆర్ 2024 చట్టంపై సభలో మాట్లాడారు.
Read also: KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదు..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరికంలోనూ ఉండేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే అమాయకులు శిక్ష అనుభవిస్తారని అన్నారు. సిద్దిపేట జిల్లాలో ధరణి తప్పుడు రికార్డుతో మద్దెల కిష్టయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. గత హయాంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలకు చెందిన వేలాది ఎకరాల భూములను ధర్నాలు తీసుకొచ్చి లాక్కెళ్లారని ఆరోపించారు. తాము తీసుకువస్తున్న భూభారతి నిజమైన ప్రజల చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Maheshwar Reddy: కేసీఆర్ పేదల భూములు లాక్కున్నారన్న కాంగ్రెస్.. లాభ పడింది ఎవరో చెప్పడం లేదు..
తాజావార్తలు
-
Story Board : స్వతంత్ర భారత ప్రస్థానం ఎలా ఉంది..? ఇన్నేళ్లలో మనం ఏం సాధించాం..?
-
CM Revanth Reddy : ఉత్తర తెలంగాణకు సీఎం రేవంత్ వరాలు.. రూ.16 వేల కోట్ల పనులకు శ్రీకారం..
-
OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
-
Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
-
OTR: బీఆర్ఎస్కు కాంగ్రెస్ బిగ్ కౌంటర్..! 10 ఏళ్ల భూ కేటాయింపుల చిట్టా..!
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!