Minister Ponguleti: రౌడీయిజం సరికాదు.. కట్టడి చేయండి
- సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరం..
- స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేపర్లు విసిరేసిన తీరు దారుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Ponguleti: సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరు బాధాకరమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దళితెడూర స్పీకర్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. రౌడీయిజం చేయడం సరికాదన్నారు. దీన్ని కట్టడి చేయాలన్నారు. ఒక ఎమ్మెల్యే కేసు గురించి ఇలా చేయడం సరికాదన్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు విసిరేయడం కరెక్ట్ కాదన్నారు. ఇది స్పీకర్ కు అవమానించడమే అన్నారు. సభ అనంతరం చాంబర్కు పిలుస్తానని స్పీకర్ చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలా ప్రవర్తించడం బాధాకరం అన్నారు.
Read also: Harish Rao Vs Speaker: ఒక సభ్యుని కోసం సభా సమయం వృధా చేయడం కరెక్ట్ కాదు
Also Read
- Telangana Cabinet : ఈనెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి భారీగా పెంపు..
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
మరోవైపు మంత్రులు అసెంబ్లీలో లేరని మాజీ మంత్రి హరీశ్ రావు అనడం అన్యాయమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తాను సభలో ఉన్నానని.. నేను మంత్రినేనని గమనించాలని అన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 2020 ఆర్ఓఆర్ చట్టం వల్ల లక్షలాది మంది రైతులు నష్టపోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నష్టపోయిన రైతులందరికీ భరోసా కల్పించేందుకు కొత్త చట్టం తెస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్య మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్ఓఆర్ 2024 చట్టంపై సభలో మాట్లాడారు.
Read also: KTR: కేసు విషయంలో నేనేం భయపడడం లేదు..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ధరణి లాంటి చట్టం గత రాచరికంలోనూ ఉండేదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే అమాయకులు శిక్ష అనుభవిస్తారని అన్నారు. సిద్దిపేట జిల్లాలో ధరణి తప్పుడు రికార్డుతో మద్దెల కిష్టయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. గత హయాంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బీసీలకు చెందిన వేలాది ఎకరాల భూములను ధర్నాలు తీసుకొచ్చి లాక్కెళ్లారని ఆరోపించారు. తాము తీసుకువస్తున్న భూభారతి నిజమైన ప్రజల చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
Maheshwar Reddy: కేసీఆర్ పేదల భూములు లాక్కున్నారన్న కాంగ్రెస్.. లాభ పడింది ఎవరో చెప్పడం లేదు..
తాజావార్తలు
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
-
Dragon : 4 నిమిషాల రన్ టైంతో ఎన్టీఆర్ ‘డ్రాగన్’ గ్లింప్స్.. ప్రశాంత్ నీల్ మాస్టర్ ప్లాన్ ఇదే!
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!