Meerpet Murder Case: మీర్పేట్ హత్య కేసులో పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న గురుమూర్తి
- మీర్పేట్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- ఈ నెల 14వ తేదీన భార్యభర్తల మధ్య గొడవ..
- కోపంతో మాధవిని గోడకేసి కొట్టిన గురుమూర్తి..
- మధవి చనిపోవడంతో.. శవం మాయం చేయాలని ప్లాన్ చేసిన గురుమూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerpet Murder Case: హైదరాబాద్లోని మీర్పేట్లో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా.. దర్యాప్తులో ఒక్కో విషయం బయటకు చెబుతుంటే.. పోలీసులే షాక్ అవుతున్నారు. గురుమూర్తి పోలీసుల ముందు చెప్పిన విషయాలు.. 14వ తేదీన భార్య, పిల్లలతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి వెళ్ళాం.. ఆ తర్వాత పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలి ఇంటికి వచ్చాం.. భార్య నాతో గొడవ పెట్టుకుంది.. తాళి తీసి మొహంపై విసిరింది.. వెంటనే గోడకు అదిమి కొట్టాను.. స్పృహ తప్పి పడింది అనుకున్నా.. కానీ చనిపోయిందని పేర్కొన్నారు. శవం మాయం చేయాలని ప్లాన్ చేశా.. ఇంట్లో ఉన్న రెండు కత్తులు తీసుకుని శరీరంలోని మెత్తటి భాగాలు అన్నీ కోశాను.. వాటర్ హీటర్ ను ఆన్ చేసి బకిట్ లో నీళ్ళు పెట్టి.. ముక్కలను అందులో వేశా.. 6 గంటల పాటు ఉడికించా.. బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలులో వేసి పొడి చేశా.. అనంతరం బోన్స్ ను కూడా బూడిద అయ్యే వరకు కాల్చిన.. మొత్తం పొడి, బూడిద చేసి.. రెండు బకిట్లలో తీసుకెళ్ళి చెరువులో పడేసా అని గురుమూర్తి వెల్లడించారు.
Read Also: America : దూకుడు చూపిస్తున్న ట్రంప్.. అప్పుడే మెక్సికో సరిహద్దుకు 1500 మంది సైనికులు
Also Read
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- Minister Sridhar Babu : ‘హిట్లర్’ వ్యాఖ్యలపై రగడ.. కేసీఆర్ వీడియోతో శ్రీధర్ బాబు కౌంటర్.!
- Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
- CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
ఇక, పినాయిల్ తో ఇంట్లో రక్తం క్లీన్ చేశాను అని గురుమూర్తి తెలిపాడు. అతడు చెప్పిన వాటిలో ఒక్కధానికి కూడా పోలీసులు ఆధారాలు దొరకకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్, హీటర్, బకెట్లతో పాటు అన్ని వస్తువులను ఫోరెన్సిక్ టీమ్ తో తనిఖీ చేయిస్తున్నారు. హత్య కేసులో ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో.. పోలీసులు అయోమయానికి గురి అవుతున్నారు. చెరువులో కూడా గాలించిన ఒక్క ఆధారం లభించలేదని పోలీసులు వెల్లడించారు. తన భార్యను హత్య చేసి ముక్కలు చేశానని చెప్తూనే.. నేను చంపాను అనడానికి ఆధారాలు ఏవీ అని పోలీసులను అతడు ప్రశ్నిస్తున్నాడు. మీ సంగతి కోర్టులో చూసుకుంటానని పోలీసులనే గురుమూర్తి బెదిరిస్తున్నాడు. ఈ కేసులో ఒక్క ఆధారం కూడా దొరకక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!