Narayanpet Incident: విద్యార్థులు అస్వస్థత గురైన ఘటన.. హెడ్ మాస్టర్ సస్పెండ్..
- నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
- మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులకు అస్వస్థత..
- 15 మంది విద్యార్థుల పరిస్థితి విషమం- మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స..
- ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్- విచారణకు ఆదేశం..
- హెడ్ మాస్టర్ సస్పెండ్- మధ్యాహ్న భోజన ఏజెన్సీ రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narayanpet Incident: నారాయణపేట జిల్లా మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 50 మంది విద్యార్థులకు అస్వస్థత గురైన ఘటన సంచలనంగా మారింది. సమారు 15 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారందని మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఏం జరిగింది అనే దానిపై విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ను వెంటనే సస్పెండ్ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్సిగ్నల్
- GHMC : ఆస్తి పన్నుపై తెలంగాణ బిగ్ రిలీఫ్.. 100% వడ్డీ మాఫీ.!
కాగా..ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో మధ్యాహ్నం సాంబార్ గుడ్లతో కూడిన భోజనం చేసిన విద్యార్థులకు కొద్ది నిమిషాల వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్క విద్యార్థి అపారమైన స్థితిలోకి వెళ్లడం..వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి తో బాధపడ్డారు. ఉపాధ్యాయులకు విషయం తెలపడంతో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Fake Ration Cards: 98.7శాతం లబ్ధిదారుల ధ్రువీకరణ పూర్తి.. 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల గుర్తింపు
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!