KTR Tweet Viral: బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా?.. కేటీఆర్ ట్విట్ వైరల్..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్..
- అన్ని రంగాల్లో వైఫల్యం-అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet Viral: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. సీపీఎస్ రద్దు చేసి..ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి..ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా? అని కేటీఆర్ మండిపడ్డారు. అన్ని రంగాల్లో వైఫల్యం..అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నాయని తెలిపారు. సకల జనులను దగా చేసింది కాంగ్రెస్ సర్కారు అని పేర్కొన్నారు. ఉద్యోగులు.. నిరుద్యోగులు.. విద్యార్థులు.. రైతులు.. కార్మికులు.. మహిళలు సమాజంలోని ప్రతి సెక్షన్ ఆందోళన బాటలోనే వున్నారని తెలిపారు. ఐదు డీఏలు పెండింగ్లో వుంచడం ఏంటి.. ఇంత అన్యాయం ఎప్పుడైనా వుందా? అని ప్రశ్నించారు. కనీసం కలిసి మాట్లాడటానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలను అవమానించడం భావ్యమా? విన్నపాలు వినే తీరికకూడా లేదా ఈ ముఖ్యమంత్రికి? అని మండిపడ్డారు.
Read also: Etela Rajender: ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొనండి.. మూసీ బాధితులకు ఈటెల పిలుపు..
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
- Vijayashanthi : ఫీజు బకాయిలపై విజయశాంతి ఫైర్.!
- Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
కొత్త పీఆర్సీ వేసి ఆరు నెలల్లోనే సిఫారసులు అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది వాస్తవం కాదా? 11 నెలలు గడిచినా రెండో PRC నివేదికను ఎందుకు తెప్పించుకోలేదు? అన్నారు. సీపీఎస్ రద్దు చేసి..ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి..ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా? అన్నారు. తెలంగాణ ఉద్యమంలో..స్వరాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ వర్గాల సమస్యలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం..! అన్నారు. నెలల తరబడి జీతాల్లేక చిరుద్యోగులు…కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అల్లాడిపోతున్నారు..! అన్నారు. ఆశాలు..అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలకు దిక్కుమొక్కు లేదు..! అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈవోల పనిభారం బాధ.. ఆవేదన వినకుండా వందల మందిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దుర్మార్గం..! అన్నారు. ఉద్యోగుల మీద కక్ష కట్టడం మంచిది కాదు..వాళ్ల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి..! అని ప్రభుత్వానికి సూచించారు.
Bandi Sanjay: జాలేస్తోంది..? కేటీఆర్ లీగల్ నోటీసుపై బండి సంజయ్ స్పందన..
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!