KTR Tweet Viral: బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా?.. కేటీఆర్ ట్విట్ వైరల్..
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్..
- అన్ని రంగాల్లో వైఫల్యం-అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Tweet Viral: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు. సీపీఎస్ రద్దు చేసి..ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి..ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా? అని కేటీఆర్ మండిపడ్డారు. అన్ని రంగాల్లో వైఫల్యం..అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నాయని తెలిపారు. సకల జనులను దగా చేసింది కాంగ్రెస్ సర్కారు అని పేర్కొన్నారు. ఉద్యోగులు.. నిరుద్యోగులు.. విద్యార్థులు.. రైతులు.. కార్మికులు.. మహిళలు సమాజంలోని ప్రతి సెక్షన్ ఆందోళన బాటలోనే వున్నారని తెలిపారు. ఐదు డీఏలు పెండింగ్లో వుంచడం ఏంటి.. ఇంత అన్యాయం ఎప్పుడైనా వుందా? అని ప్రశ్నించారు. కనీసం కలిసి మాట్లాడటానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉద్యోగ సంఘాలను అవమానించడం భావ్యమా? విన్నపాలు వినే తీరికకూడా లేదా ఈ ముఖ్యమంత్రికి? అని మండిపడ్డారు.
Read also: Etela Rajender: ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొనండి.. మూసీ బాధితులకు ఈటెల పిలుపు..
Also Read
- CM Revanth Reddy: “చర్చ తర్వాతే నిర్ణయం తీసుకుంటాం”.. సభలో సభ్యుల తీరుపై సీఎం ఆగ్రహం..!
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
కొత్త పీఆర్సీ వేసి ఆరు నెలల్లోనే సిఫారసులు అమలు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది వాస్తవం కాదా? 11 నెలలు గడిచినా రెండో PRC నివేదికను ఎందుకు తెప్పించుకోలేదు? అన్నారు. సీపీఎస్ రద్దు చేసి..ఓల్డ్ పెన్షన్ స్కీం తిరిగి తెస్తామని మాటిచ్చి..ఇప్పుడు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటే ఎట్లా? అన్నారు. తెలంగాణ ఉద్యమంలో..స్వరాష్ట్ర ప్రగతిలో కీలక భూమిక పోషించిన ఉద్యోగ వర్గాల సమస్యలను పట్టించుకోకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం..! అన్నారు. నెలల తరబడి జీతాల్లేక చిరుద్యోగులు…కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బంది అల్లాడిపోతున్నారు..! అన్నారు. ఆశాలు..అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలకు దిక్కుమొక్కు లేదు..! అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏఈవోల పనిభారం బాధ.. ఆవేదన వినకుండా వందల మందిని ఏకపక్షంగా సస్పెండ్ చేయడం దుర్మార్గం..! అన్నారు. ఉద్యోగుల మీద కక్ష కట్టడం మంచిది కాదు..వాళ్ల సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టండి..! అని ప్రభుత్వానికి సూచించారు.
Bandi Sanjay: జాలేస్తోంది..? కేటీఆర్ లీగల్ నోటీసుపై బండి సంజయ్ స్పందన..
తాజావార్తలు
-
Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
-
KTR: శాసనసభ కాదు.. అది దుశ్శాసన సభ: సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
-
CM Vijay: అన్నా, ఎంజీఆర్, ఎన్టీఆర్ల సరసన విజయ్.. “1967, 1977, 1982, 2026” అంటూ కీలక వ్యాఖ్యలు
-
Varanasi: ‘వారణాసి’ ఊచకోత.. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.320 కోట్ల బిజినెస్సా?
-
LPG Booking: ఎల్పీజీ వినియోగదారులకు భారీ ఊరట.. బుకింగ్ సమయంపై కేంద్రం కీలక ప్రకటన
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!