KTR: రెండేళ్లు బీఆర్ఎస్కు పరీక్ష కాలం.. వాళ్లు ఏమ్మన్న తలదించుకుని వెళ్లండి..
- పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వం మాట మార్చింది..
- గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ కాలు బయట పెట్టలేదు..
- తెలంగాణలో అద్భుతంగా బీఆర్ఎస్ నేతలు సర్పంచులుగా గెలిచారు..
- రెండేళ్లు బీఆర్ఎస్కు పరీక్ష కాలం.. వాళ్లు ఏమ్మన్న తలదించుకుని వెళ్లండి: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: తెలంగాణ భవన్ లో తాండూరు నియోజకవర్గం నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ వారిని సన్మానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ ప్రోగ్రెస్ ఉండదు.. రెండేళ్లు మనకు కష్టాలు తప్పవు అని సెటైర్లు వేశారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పెడతారని అనుకోవడం లేదు.. పంచాయతీ ఎన్నికల ఫలితాల విషయంలో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఐదు నిమిషాలకే మాట మార్చారు అని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కేసీఆర్ కాలు బయట పెట్టకపోయినా గులాబీ సైనికులు అద్భుతంగా పోరాడారు, ప్రభుత్వం భయపడే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ అన్నారు.
Read Also: Bangladesh Violence: బంగ్లాదేశ్లో హత్యకు గురైన హిందువు దీపు చంద్ర దాస్ ఎవరు?
Also Read
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
- K Kavitha : కవితకు సమన్లు.. రేపు కోర్టుకు హాజరు కావాలని ఆదేశం..
- KCR Meeting : ఎర్రవల్లి వేదికగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్.. బీఆర్ఎస్ ప్రక్షాళనకు శ్రీకారం..!
అయితే, కారు గుర్తు ఉండి, కేసీఆర్ గుర్తుకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అని కేటీఆర్ తెలిపారు. రెండేళ్లు బీఆర్ఎస్ కు పరీక్ష కాలం.. కాంగ్రెస్ వాళ్లు ఏమైనా అంటే తలదించుకుని వెళ్లండి, రెండు అడుగులు వెనక్కు వెళ్లండి అని సూచించారు. పంచాయతీలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వస్తాయి, ఎవరి ప్రమేయం ఉండదన్నారు. బీఆర్ఎస్ సర్పంచులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వమని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు.. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు ఇలా అన్నింటి జాబితా పంచాయతీల్లో పెట్టాల్సిందే.. సర్పంచులు, పంచాయతీల చేతిలోనే ఉంటుంది.. నిధులు రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు.. కాంగ్రెస్ చేతిలో మోసపోని వారంటూ ఎవరూ లేరు, అందరూ బాధపడుతున్నారు.. జనవరి, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు వస్తాయని అంటున్నారు.. ఇప్పటి నుంచే సిద్ధం కావాలి.. గ్రామీణ ప్రాంతాల వారికి మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు అప్పగించండి అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
తాజావార్తలు
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!