Minister Damodar Raja Narasimha: జూడాలకు అండగా ఉంటాం.. అన్ని సమస్యలు పరిష్కరిస్తాం..!
- తెలంగాణలో జూడాల ఆందోళన..
- మంత్రి దామోదర రాజనర్సింహతో జూడాల భేటీ..
- జూడాల షరతులకు అంగీకరించిన తెలంగాణ సర్కార్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Damodar Raja Narasimha: హైదరాబాద్ లో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో జూడాలు భేటీ అయ్యారు. ఆ తర్వాత నిరసన చేస్తున్న జూడాలు సమ్మె విరమించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ జూడాలు గతంలో రెండు సార్లు మెడికల్ కాలేజ్, హాస్పిటల్స్ లో పెండింగ్ సమస్యలపై కలవడం జరిగింది అని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 15వ తేదీన రిప్రజెంటేషన్ ఇచ్చారు.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రి లకు చరిత్ర ఉంది.. కానీ హాస్టల్స్ పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కేఎంసీ రోడ్డు గురించి అడిగారు.. అలాగే, పోలీసు భద్రత కావాలని అడిగారు.. నేను, మా శాఖలోని ఉన్నతాధికారులతో మాట్లాడా.. వారి స్టై పెండ్ కోసం సుమారు 406 కోట్ల రూపాయల జీవో కూడా విడుదల చేసామన్నారు. హాస్టల్స్ నిర్మాణం, పునరుద్దరణకు దాదాపుగా రూ. 204 కోట్లు ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజ్ కోసం విడుదల చేసామని మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు.
Read Also: Minister Anam Ramanarayana Reddy: ప్రతిష్టాత్మకంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లపై మంత్రి ఆనం సమీక్ష..
Also Read
- Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
- Danam Nagender : దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
- Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
ఇక, ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం అనేది కోర్టు పరిధిలో ఉంది అని ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహా అన్నారు. కానీ మా ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం పట్ల సీరియస్ గానే ఉంది.. పాలసీలలో మార్పులు తీసుకురాబోతున్నాం.. సమ్మె విరమించినందుకు జూడాలకు ధన్యవాదాలు అని మంత్రి చెప్పారు. ఇందులో రాజకీయాలు అవసరం లేదు.. సామాన్యుడికి మెరుగైన వైద్యం, నాణ్యమైన వైద్య విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిది.. అలాగే, మొబైల్ ఫుడ్ ల్యాబ్స్ పెంచబోతున్నాం.. డ్రగ్స్ కి సంబంధించిన ల్యాబ్స్ పెంచనున్నాం.. అన్ని రకాల ఫుడ్స్ అవైలబుల్ హైదరాబాద్ లో ఉంది కానీ నియంత్రణ లేదు… అది మేము చేస్తామన్నారు. క్లినికల్ ఎస్టబులిష్మెంట్ యాక్ట్ నీ కఠినంగా అమలు చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు.
తాజావార్తలు
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
-
Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
-
Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
-
Smart Phone: 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్, 90Hz డిస్ప్లే , 12GB ర్యామ్.. మార్కెట్లోకి కొత్త ఫోన్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..