Minister Anam Ramanarayana Reddy: ప్రతిష్టాత్మకంగా రొట్టెల పండుగ.. ఏర్పాట్లపై మంత్రి ఆనం సమీక్ష..
- బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ఏర్పాట్లపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక..
- రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం..
- భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Anam Ramanarayana Reddy: రొట్టెల పండుగ అనగానే నెల్లూరు బారా షహీద్ దర్గా గుర్తుకు వస్తుంది.. మొక్కు కోవడానికి.. మొక్కులు చెల్లించుకోవడానికి.. ఇలా ప్రత్యేక రొట్టులు సమర్పించుకుంటారు భక్తులు.. దీనిని రోటియాన్ కి ఈద్ లేదా రొట్టెల పండుగగా నిర్వహిస్తారు.. ప్రతీ ఏడాది మూడు రోజుల పాటు ఈ పండుగ నిర్వహిస్తారు.. ముహర్రం నెలలో వార్షిక కార్యక్రమం జరుపుకుంటారు. ఆలయాన్ని సందర్శించిన మహిళలు నెల్లూరు ట్యాంక్లో రోటీలు మార్చుకుంటారు.. ఇక, బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రొట్టెల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తాం అన్నారు. దర్గా వద్ద ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తాం.. దర్గా పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించేలా మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేకంగా వైద్య బృందాలను అందుబాటులో ఉంచుతాం.. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అధికారులు సిబ్బంది వ్యవహరించాలని సూచించారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.
Read Also: Tamannah: వివాదంలో తమన్నా.. 7వ తరగతి విద్యార్థులకి పాఠంగా జీవిత చరిత్ర?
Also Read
- Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
- CM Chandrababu: ఎస్సీ, ఎస్టీల రక్షణకు ప్రత్యేక వ్యవస్థ.. ప్రొటెక్షన్ సెల్, విజిలెన్స్ కమిటీలు.. సీఎం కీలక సమీక్ష
- Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
- India vs Afghanistan T20: వాషింగ్టన్, నితీష్ ఎంపికపై మాజీ క్రికెటర్ అసంతృప్తి.. గంభీర్పై పరోక్ష విమర్శలు
ఇక, సమీక్షా సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో దర్గా ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశాం.. 2014-19 మధ్య కాలంలో దర్గా అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20 కోట్ల రూపాయలను మంజూరు చేశారు.. ప్రస్తుతం ప్రభుత్వంలోని ఏ శాఖలోనూ నిధులు లేవు. పురపాలక శాఖకు పన్నుల రూపంలో 3 వేల కోట్ల రూపాయలు వచ్చాయి.. కానీ, వాటిని గత ప్రభుత్వం పూర్తిగా వాడేసిందన్నారు.. దర్గా వద్ద దుకాణాలకు నిర్వహించిన వేలంలో రూ. కోటి 56 లక్షల మేర నిధులు వచ్చాయి.. వాటిని దర్గా అభివృద్ధి కోసం వినియోగిస్తాం అన్నారు.. శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులు ఇబ్బంది పడకుండా సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు మంత్రి నారాయణ.
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!