హైదరాబాద్ నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ నిర్వాహకుడు సంజయ్ కుమార్ అగర్వాల్ సుంకం లేని బంగారాన్ని అక్రమ చెలామణి చేశారని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే కోల్కతా ఈడీ అధికారులు డీఆర్ఐ కేసు ఆధారంగా విచారణ జరుపుతున్నారు. పుణెలో సంజయ్ కుమార్ ను అరెస్టు చేసి కోల్కతా కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కోర్టు అనుమతితో కోల్ కతా ఈడీ సంజయ్ కుమార్ ను ఏడు రోజుల కస్టడీకి తీసుకుంది.