తమిళనాడులోని చెన్నై, మహరాష్ట్రలోని ముంబయి ఎయిర్ పోర్టుల్లో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. చెన్నైలో 2.1 కోట్ల విలువ చేసే 4.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
మరోసారి చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుల వద్ద 1.13 కోట్ల విలువ చేసే 1.42 కేజీల బంగారం తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులను కస్టమ్స్ అధికారు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి బంగారాన్ని కార్టన్ బాక్స్ మధ్య భాగంలో దాచి కేటుగాళ్లు తరలించేందుకు యత్నించారు. అయితే 5 మంది ప్రయాణీకుల కదలికలపై అనుమానంతో కస్టమ్స్ బృందం వారిని అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తమదైన…
హైదరాబాద్ నగల వ్యాపారి సంజయ్ కుమార్ అగర్వాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్లర్స్ నిర్వాహకుడు సంజయ్ కుమార్ అగర్వాల్ సుంకం లేని బంగారాన్ని అక్రమ చెలామణి చేశారని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే కోల్కతా ఈడీ అధికారులు డీఆర్ఐ కేసు ఆధారంగా విచారణ జరుపుతున్నారు. పుణెలో సంజయ్ కుమార్ ను అరెస్టు చేసి కోల్కతా కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు. కోర్టు అనుమతితో కోల్ కతా ఈడీ…
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా 24 క్యారెట్ల బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుల వద్ద రూ.3 కోట్ల విలువైన 6 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కేటుగాళ్లు సినీ ఫక్కీలో బంగారాన్ని తరలించే యత్నం చేశారు. దుబాయ్ నుంచి లగేజీ బ్యాగులో మోసుకొని వచ్చిన సెల్ఫోన్లలో బంగారాన్ని దాచి దర్జాగా తప్పించుకోవాలని చూశారు. బంగారాన్ని కరిగించి ల్యాప్టాప్, సెల్ ఫోన్ బ్యాటరీలుగా తయారు చేసి కేటుగాళ్లు అందులో దాచిపెట్టారు. Read Also: వైరల్:…