మన భారత దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి ఉండదు. ముఖ్యంగా మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి బాగా ఇష్టపడతారు. అయితే మన ఇండియాలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి రోజున స్థిరంగా నమోదైన బంగారం ధరలు… ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 45,350 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 220 పెరిగి రూ. 49, 480 కి చేరింది. ఇక అటు వెండి ధరలు మాత్రం కాస్త పెరిగిపోయాయి. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ. 66,200 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.