Etela Rajender: ఫార్మా కంపెనీలకు రైతుల భూములు అప్పజెప్పే ప్రయత్నం.. ఈటల ఫైర్
- ఢిల్లీ నుండి ఎంపీ ఈటల రాజేందర్ స్పందన..
- లగిచెర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం..
- అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నామన్న ఎంపీ ఈటల రాజేందర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etela Rajender: ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. లగిచెర్ల అరెస్టుల ఘటనపై ఢిల్లీ నుండి ఈటల రాజేందర్ స్పందించారు. లగిచెర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నాము. వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందన్నారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. నీకు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని కీలక వ్యఖ్యలు చేశారు. లగిచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. దీనిని అక్కడ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు.
Read also: Komati Reddy Counter: కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటి రెడ్డి గట్టి కౌంటర్
Also Read
- Hyderabad Ropeway: హైదరాబాద్లో ఆకాశ మార్గ ప్రయాణం.. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా రోప్వేలకు భారీ ప్రణాళిక.!
- Bhatti Vikramarka : కాంగ్రెస్ పాలనలోనే మహిళల అభ్యున్నతి
- CM Revanth Reddy : తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై రేవంత్ సర్కార్ కీలక అడుగు.. మహారాష్ట్ర సీఎంకు లేఖ!
- Hyderabad: తెలంగాణ ప్రజలకు గుడ్న్యూస్.. గ్రామాల్లో టీ-ఫైబర్ ఇంటర్నెట్కు గ్రీన్సిగ్నల్
మా భూములు గుంజుకోకండి, మా ఉపాధి మీద దెబ్బకొట్టకండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా.. వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశారు, నిరసనలు తెలిపారన్నారు. గ్రామసభలను బహిష్కరించారన్నారు. స్వయంగా ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టి ప్రభుత్వం భూసేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసింది. దీనితో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారని స్పష్టం చేశారు. దీనిని అడ్డం పెట్టుకొని కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాలలో మోహరించి అరెస్టు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నామని తెలిపారు. భూ సేకరణ రైతుల ఇష్ట ప్రకారం చేయాలి తప్ప బలవంతంగా తీసుకునే అధికారం మీకు ఇవ్వలేదు.
Read also: Phone Tapping: కేసులో కీలక పరిణామం.. నలుగురు మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు..
గతంలో ముచ్చర్లలో ఫార్మసిటీ కోసం 8 లక్షలకు భూములు సేకరించి కోటి రెండు కోట్లకు ఫార్మా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని, బీజేపీగా మేము కూడా వ్యవహరించే వ్యతిరేకించామన్నారు. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పరమైన భూములు ఇవ్వండి కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. పేదల భూములు గుంజుకొని పెద్దలకు కట్టబెట్టి ఆ భూములతో డబ్బులు సంపాదించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఫార్మాసిటీ పేరిట అక్కడి ప్రాంత ప్రజానికంపై ప్రభుత్వం చేస్తున్న దుచ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. అక్రమ అరెస్టులు చేసి, వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు. ప్రజలు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుదాం. మేమంతా మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నామని ఈటల రాజేందర్ తెలిపారు.
Komati Reddy Counter: కేటీఆర్ వ్యాఖ్యలకు కోమటి రెడ్డి గట్టి కౌంటర్
తాజావార్తలు
-
AB de Villiers: వైభవ్ను ఆ ఆస్ట్రేలియా దిగ్గజంతో పోల్చిన డివిలియర్స్.. బుడ్డోడి మెచ్యూరిటీపై ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: సచిన్ కలలు చూపించాడు.. ధోనీ నమ్మకం నేర్పించాడు.. కోహ్లీ గర్జించాడు.. ఇక వైభవ్ సూర్యవంశీ యుగం ప్రారంభమైందా..?
-
ఒకే కారు.. మూడు ఆప్షన్లు.. పెట్రోల్, సీఎన్జీ, ఈవీతో సరికొత్త Tata Tiago రిలీజ్.. ధర రూ. 5 లక్షల లోపే..
-
Abhishek Sharma: ఒత్తిడిని తట్టుకోలేకపోతున్న అభిషేక్ శర్మ.. కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేస్తున్న కాటేరమ్మ కొడుకు!
-
US-Iran: ట్రంప్ కఠిన వైఖరితో పాక్ ప్లాన్ బోల్తా.. అమెరికా-ఇరాన్ మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ఫెయిల్..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..