బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. తన సహజ శైలికి భిన్నంగా వీధి భాష వాడుతున్నారన్న అభిప్రాయం తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలపడుతోంది. తన నియోజక వర్గంలోని ఒక ప్రాంతంలో ప్రజలకి స్థానిక తహశీల్దార్ నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డారు ఎంపీ. ఆ టైంలోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ... నోరు జారారు. సీఎంని అనకూడని మాట అనేయడంతో... ఫైర్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈటల ఇంటి ముట్టడికి కూడా పిలుపునిచ్చింది అధికార పార్టీ.
మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీరు ఉన్నట్టుండి మారిపోయింది. ఎంతటి సీరియస్ విషయాన్నయినా కూల్గా డీల్ చేసి తనదైన శైలిలో సాఫ్ట్ ముగింపు ఇచ్చే ఈటల భాష ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది. తన సహజత్వానికి భిన్నంగా ఆయన చేస్తున్న ఎగ్రెసివ్ కామెంట్స్ నాలుగైదు రోజులుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశం అవుతోంది.
MP Eatala Rajender: మూసీ ప్రక్షాళన, మురుగునీటి శుద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాలని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. పార్లమెంట్ లో మాట్లాడిన ఆయన.. శుభ్రమైన తాగునీటి కోసం తెలంగాణకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ టార్గెట్గా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ రేంజ్ ప్రచారం జరుగుతోంది. అందులో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా... ప్రచారం మాత్రం కచ్చితంగా ఆయనకు బీజేపీ పరంగా వచ్చే అవకాశాల్ని దెబ్బ తీస్తుందన్న అంచనాలున్నాయి. దీంతో.. సోషల్ మీడియా వేదికగా ఈటలను కేంద్ర బిందువుగా చేసుకుని జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందా? లేక ఎవరైనా కావాలని టార్గెట్ చేస్తున్నారా అన్న ఆరాలు పెరిగిపోతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో.
ఉదయం ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప చెల్లుమనిపించిన ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. 25 ఏళ్ల జీవితంలో ఎవరిపై చేయి చేసుకోలేదని ఈటల అన్నారు. కానీ ఈ రోజు న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
Etela Rajender: ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. లగిచెర్ల అరెస్టుల ఘటనపై ఢిల్లీ నుండి ఈటల రాజేందర్ స్పందించారు. లగిచెర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నాము. వారి మీద కేసులు పెడితే యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేస్తుందన్నారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు.…
ఉప్పల్-నారపల్లి నిలిచిపోయిన నూతన ఫ్లై ఓవర్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు. 2018లో ప్రారంభమై నేటికి ఫ్లై ఓవర్ పనులు పూర్తికాలేదు. ఐదేళ్ళైనా ఫ్లై ఓవర్ పూర్తి కాకపోవడం కారణాలపై నేషనల్ హైవే అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు.