Ambati Rambabu: అరబ్ దేశాల శిక్షలు, చట్టాలు చెప్పి భయపెడుతున్నారు..
- వైసీపీ సోషల్ మీడియాపై కక్ష్య గట్టి వేధిస్తున్నారు
- వైసీపీ సోషల్ మీడియాను చిందర వందర చేయాలని చంద్రబాబు కుట్ర
- మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: చంద్రబాబు పులి మీద స్వారీ చేస్తున్నాడని.. ఆ పులి మిమ్మల్నే తింటుందని వైసీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్ మీడియాపై కక్ష్య గట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియాను చిందర వందర చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్లను అక్రమ అరెస్టు చేశారని విమర్శించారు. సుధారాణి, ఆమె భర్త పక్క రాష్ట్రంలో తల దాచుకుంటే అరెస్టు చేశారన్నారు. ఇప్పుడు వాళ్లను పరామర్శించడానికి మేము వస్తే ఇక్కడి నుండి ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారని అన్నారు. సోషల్ మీడియాలో ఏం పోస్టులు పెట్టారు అనేది నిర్ణయించేది పోలీసులు కాదు… అందుకు న్యాయస్థానాలు ఉన్నాయన్నారు.
Read Also: Atrocious in Nandyal: దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
Also Read
వర్రా రవీంద్రారెడ్డిని, సుధారాణిని అర్ధరాత్రి న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారని.. అర్ధరాత్రి న్యాయమూర్తుల ఇళ్ల వద్ద హాజరు పెట్టాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించారు. పౌర సమాజంలో ప్రజాస్వామ్యం ఉందా అని అడిగారు. కోయా ప్రవీణ్ అనే సీనియర్ పోలీసు అధికారి మాటలు దారుణంగా ఉన్నాయన్నారు. అరబ్ దేశాల శిక్షలు,చట్టాలు చెప్పి భయపెడుతున్నారన్నారు. ఈ అధికారి గతంలో ప్రకాశం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా పని చేశారని చెప్పారు. ఐపీఎస్ అధికారులు చట్ట ప్రకారం వ్యవహరించాలని.. మా మీద అసభ్య పోస్టులు పెడితే పోలీసులు ఎందుకు పట్టించుకోరని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
పోలీసు వ్యవస్థ ను కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఖూనీలు చేసే వారిని, దొంగ తనాలు చేసే వారిని కొట్టడమే తప్పు అని చెప్పే ఈ ప్రజాస్వామ్యం లో రాజకీయ కక్ష్యతో పోలీసులు దాడి చేస్తున్నారన్నారు. 2015లో పెట్టిన పోస్టులకు ఇప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. నిజాంబాద్లో ఉండే జగన్ అభిమానిని వేధించారన్నారు. తుళ్ళూరు డీఎస్పీ మురళీ కృష్ణ బూటు కాలుతో తన్ని , వైఎస్ జగన్ను అసహ్యంగా మాట్లాడుతున్నారన్నారు. పోలీసులు ఇంత దిగ జారి ప్రవర్తించాలా అంటూ వ్యాఖ్యానించారు. అరబ్ దేశాలలో అయితే ఇలాంటి పోలీసులకు ఉరి వేస్తారన్నారు. బడ్జెట్లో ప్రజలకు ఏం ఒరగ పెట్టలేదు.. సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయించింది లేదన్నారు. నాలుగు నెలల్లో వేల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు. టీడీపీ నేతలు చేసే పాపాలు డీజీపీకి యజ్ఞాలలా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. పోలీసులకు అంత ఇష్టం ఉంటే రాజకీయాల్లోకి రావచ్చన్నారు.
- Tags
తాజావార్తలు
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!