KTR: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. కేటీఆర్ కీలక ఆదేశాలు
- హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..
- బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎవరికీ ఓటు వేయొద్దని ఆదేశాలు..
- ఎవరైనా విప్ ధిక్కరించి ఓటింగ్ కు వెళ్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: గ్రేటర్ హైదరాబాద్ లోని పార్టీ నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. గ్రేటర్ పరిధిలో ఏ ఎన్నికలు జరిగినా మనమే గెలిచే వాళ్ళం.. మొన్న 2023లో కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల అన్ని స్థానాలు మనమే గెలిచాం.. హైదరాబాద్ వాళ్ళు అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి మనల్ని గెలిపించారు.. ఔటర్ అవతల ఉన్న వాళ్లు కాంగ్రెస్ మాటలకు మోసపోయారు అని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకం చేస్తుంది.. హైడ్రాతో పేదలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు.. ఆరు గ్యారెంటీలకు డబ్బులు లేవు అంటూనే.. మూసి సుందరీకరణ చేస్తాను అంటున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుఫాను వాతావరణంలో బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. ఇక, సందట్లో సడెమియా లాగా బీజేపీ వాళ్ళు ఉన్నారు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Drishyam 3 : పాన్ ఇండియా లెవల్లో దృశ్యం- 3..!
Also Read
- Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
- CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్లో సీఎం రేవంత్రెడ్డి కాన్వాయ్
- Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
ఇక, కేంద్రంలో ఒక సహాయ మంత్రి, మరో నిస్సహాయ మంత్రి ఉండి ఎలాంటి లాభం లేదు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కంచె గచ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ ఉన్నాడంటే.. అందరూ ఎంపీలు భుజాలు తడుముకుంటున్నారు.. బయటకు వచ్చి బీజేపీ ఎంపీలు నన్ను తిడుతున్నారు.. సోనియా, రాహుల్ గాంధీల మీద చార్జ్ షీట్ వేస్తే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఆందోళన చేశారు.. కానీ, రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడలేదు.. బీజేపీ, నరేంద్రమోడీతో చోట భాయ్- బడా భాయ్ బంధం ఉంది కాబట్టే రేవంత్ మాట్లాడడం లేదని కేటీఆర్ ఆరోపించారు.
Read Also: Greater Visakha Mayor: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కూటమి వశం
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికీ ఓటు వేయొద్దు అన్నారు. ఆ రోజు ఎన్నికల్లో పాల్గొనవద్దు.. ఎవరూ ఓటుకు వెళ్లకుండా విప్ కూడా ఇస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్న మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరూ ఓటు వేయడానికి వెళ్లొద్దని సూచించారు. ఎవరైనా విప్ ధిక్కరించి ఓటింగ్ కు వెళితే వారిపై చర్యలు తీసుకుంటాం.. ఓటు ఉన్న వాళ్లకు విప్ ఇవ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్, సబిత ఇంద్రారెడ్డిలను కేటీఆర్ కోరారు.
తాజావార్తలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం
-
TVK Vijay: న్యాయ నిపుణులతో విజయ్ మంతనాలు.. ప్రభుత్వ ఏర్పాటుపై సమాలోచనలు.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
-
West Bengal: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్.. టీఎంసీ సర్కార్ బర్తరఫ్..
-
Suvendu Adhikari: 13 ఏళ్లలో నలుగురు సన్నిహితుల్ని కోల్పోయిన సువేందు అధికారి..