Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
- ఫాల్కన్ స్కామ్లో ఈడీ కీలక ముందడుగు
- హాకర్ 800A విమానం రూ.3 కోట్లకు ఈ-వేలం
- బాధితులకు విక్రయ నగదు పంపిణీకి నిర్ణయం
- రూ.792 కోట్ల పోంజీ స్కామ్పై దర్యాప్తు కొనసాగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Falcon Scam : ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక పురోగతి సాధించింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈడీ అధికారులు తాము సీజ్ చేసిన ఒక విమానాన్ని ఈ-వేలం (E-Auction) ద్వారా విజయవంతంగా విక్రయించారు. హైదరాబాద్ జోనల్ ఈడీ పరిధిలో జరిగిన ఈ వేలం ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రూ. 3 కోట్లకు హాకర్ 800A విమానం విక్రయం
ఫాల్కన్ స్కామ్లో భాగంగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ‘హాకర్ 800A’ (Hawker 800A) చార్టర్డ్ విమానాన్ని ఈ-వేలంలో రూ. 3 కోట్లకు విక్రయించారు. అయితే ఈ ప్రైవేట్ విమానం ధర రూ.14 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. అయితే.. జూలై 1న ఎంఎస్టీసీ (MSTC) సంస్థ ద్వారా ఈడీ ఈ ఆక్షన్ ప్రక్రియను నిర్వహించింది. పీఎంఎల్ఏ (PMLA) అడ్జుడికేటింగ్ అథారిటీ ముందస్తు అనుమతితోనే అధికారులు ఈ విమానాన్ని వేలానికి ఉంచారు. కాగా, ఈ విక్రయం ద్వారా వచ్చిన రూ. 3 కోట్ల మొత్తాన్ని ఈ స్కామ్లో నష్టపోయిన బాధిత పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.
Also Read
శంషాబాద్ ఎయిర్పోర్టులో సీజ్
ఫాల్కన్ పోంజీ కేసులో ప్రధాన నిందితుడైన అమర్దీప్ కుమార్కు ఈ చార్టర్డ్ విమానం చెందుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2025 మార్చి 7న శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఈడీ అధికారులు దీనిని అటాచ్ చేసి, స్వాధీనం చేసుకున్నారు.
రూ. 792 కోట్ల భారీ మోసం
నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ (Fake Invoice Discounting) పేరుతో నిందితులు భారీ మోసానికి తెరలేపారు. అమర్దీప్ కుమార్ అండ్ గ్యాంగ్ దాదాపు రూ. 792 కోట్ల మేర బాధితులను నమ్మించి, పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ఈ భారీ స్కామ్కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని ఆస్తుల గుర్తింపు, నిధుల మళ్లింపుపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!