Falcon Scam : 14 కోట్ల విమానం 3 కోట్లకే.. దేశంలోనే తొలిసారిగా విమానాన్ని ఈ-వేలం.!
- ఫాల్కన్ స్కామ్లో ఈడీ కీలక ముందడుగు
- హాకర్ 800A విమానం రూ.3 కోట్లకు ఈ-వేలం
- బాధితులకు విక్రయ నగదు పంపిణీకి నిర్ణయం
- రూ.792 కోట్ల పోంజీ స్కామ్పై దర్యాప్తు కొనసాగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Falcon Scam : ఫాల్కన్ పోంజీ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక పురోగతి సాధించింది. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈడీ అధికారులు తాము సీజ్ చేసిన ఒక విమానాన్ని ఈ-వేలం (E-Auction) ద్వారా విజయవంతంగా విక్రయించారు. హైదరాబాద్ జోనల్ ఈడీ పరిధిలో జరిగిన ఈ వేలం ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రూ. 3 కోట్లకు హాకర్ 800A విమానం విక్రయం
ఫాల్కన్ స్కామ్లో భాగంగా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ‘హాకర్ 800A’ (Hawker 800A) చార్టర్డ్ విమానాన్ని ఈ-వేలంలో రూ. 3 కోట్లకు విక్రయించారు. అయితే ఈ ప్రైవేట్ విమానం ధర రూ.14 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. అయితే.. జూలై 1న ఎంఎస్టీసీ (MSTC) సంస్థ ద్వారా ఈడీ ఈ ఆక్షన్ ప్రక్రియను నిర్వహించింది. పీఎంఎల్ఏ (PMLA) అడ్జుడికేటింగ్ అథారిటీ ముందస్తు అనుమతితోనే అధికారులు ఈ విమానాన్ని వేలానికి ఉంచారు. కాగా, ఈ విక్రయం ద్వారా వచ్చిన రూ. 3 కోట్ల మొత్తాన్ని ఈ స్కామ్లో నష్టపోయిన బాధిత పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు ఈడీ స్పష్టం చేసింది.
Also Read
- Ration Card eKYC: మీరు ఈకేవైసీ పూర్తి చేశారా..? స్టేటస్ను సింపుల్గా తెలుసుకోండిలా..
- Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
- Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
- OTR : తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పదవికి లైన్ క్లియర్.. బరిలో బాలు నాయక్?
శంషాబాద్ ఎయిర్పోర్టులో సీజ్
ఫాల్కన్ పోంజీ కేసులో ప్రధాన నిందితుడైన అమర్దీప్ కుమార్కు ఈ చార్టర్డ్ విమానం చెందుతుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2025 మార్చి 7న శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో ఈడీ అధికారులు దీనిని అటాచ్ చేసి, స్వాధీనం చేసుకున్నారు.
రూ. 792 కోట్ల భారీ మోసం
నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ (Fake Invoice Discounting) పేరుతో నిందితులు భారీ మోసానికి తెరలేపారు. అమర్దీప్ కుమార్ అండ్ గ్యాంగ్ దాదాపు రూ. 792 కోట్ల మేర బాధితులను నమ్మించి, పెట్టుబడుల పేరుతో మోసం చేసినట్లు ఈడీ తన దర్యాప్తులో గుర్తించింది. ఈ భారీ స్కామ్కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే ముగ్గురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరిన్ని ఆస్తుల గుర్తింపు, నిధుల మళ్లింపుపై ప్రస్తుతం లోతైన దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వర్గాలు వెల్లడించాయి.
తాజావార్తలు
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్పై ప్రభావం చూపే 10 మార్పులు..
-
Tablet Launched: 10,100mAh బ్యాటరీ, కాగితం లాంటి డిస్ప్లే.. అదిరిపోయిన ఫీచర్స్..
-
Cauvery Dispute: కావేరీ వివాదం మళ్లీ వేడెక్కింది.. సీఎం విజయ్తో డీకే శివకుమార్ భేటీ వాయిదా
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!