Khairatabad Ganesh: నేడు గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేష్..
- ఖైరతాబాద్ మహా గణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం ..
- భక్తజనుల సందడి ఘనంగా కొనసాగుతుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khairatabad Ganesh:హైదరాబాద్లో ఖైరతాబాద్ మహా గణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా కొనసాగుతుంది. శ్రీ సప్తముఖ మహా శక్తి గణపతిగా, పది రోజుల పాటు భక్తుల నీరాజనాలందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగఒడికి చేరనున్నాడు. 70 అడుగుల ఎత్తులో భారీ కాయుడై, ప్రపంచ రికార్డు సృష్టించిన బొజ్జ గణపయ్య నిమజ్జనానికి ఇప్పటికే ఏర్పాట్లు ముగిశాయి. సోమవారం రాత్రి 10 గంటలకు చివరిసారిగా కలశపూజ నిర్వహించిన తర్వాత, పార్వతీ తనయుడిని టస్కర్పైకి చేర్చారు.
Read also: Ganesh Immersion Live Updates: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు.. లైవ్ అప్డేట్స్
Also Read
- ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
- Ganja Party Busted: గంజాయి పార్టీ గుట్టురట్టు.. పోలీసుల అదుపులో ఆయుర్వేద డాక్టర్.!
- Fish Medicine: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపమందు ప్రసాదం పంపిణీ.. రాత్రి 9 గంటల వరకే.!
- TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
స్వామివారికి ఇరువైపులా ఉన్న దేవతాముర్తుల విగ్రహాలను ట్రాలీలపైకి చేర్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తైన తర్వాత, ఖైరతాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల కొంగుబంగారమై పది రోజుల పాటు, నీరాజనాలందుకున్న మహాకాయుడి నిమజ్జనానికి భారీగా భక్తజనం రానున్న నేపథ్యంలో అదే స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ మహాక్రతువు సందర్భంగా ఖైరతాబాద్ గణేశుడి బందోబస్తులో 700 మంది పోలీసులు పాల్గొనగా, 56 సీసీటీవీ కెమెరాలతో పహారా నిర్వహిస్తున్నారు. దీంతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకూ ట్రాఫిక్ పోలీసులు అంక్షలను విధించారు.
Read also: Jani Master: ఇదేం పని.. జానీ మాస్టర్ ?
దర్శనానికి వచ్చిన భక్తులు.. దేవుడికి కానుకలు సమర్పించడం ఆనవాయితీ. ఈ క్రమంలో.. భక్తులు ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీ ఆదాయం భారీగా పెరిగింది. రూ. 70 లక్షలు కానుకల ద్వారా హుండీ ఆదాయం వచ్చినట్లు గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది. అలాగే.. హోర్డింగులు, ఇతర సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు సమకూరినట్టు సమాచారం.. అంతేకాకుండా.. ఆన్లైన్ ద్వారా, గణపతి చెంతన ఏర్పాటు చేసిన స్కానర్ల (గూగుల్ పే) ద్వారా కూడా కొంత విరాళాలు వచ్చాయి.. వాటిని లెక్కించాల్సి ఉంది. కాగా.. హుండీ లెక్కింపును సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగనుంది. ఖైరతాబాద్లో గణపతి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిసారి హుండీ లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరగడం విశేషం.
Kolkata: సీఎం మమతతో ముగిసిన జూడాల చర్చలు.. 2 గంటల పాటు చర్చలు
తాజావార్తలు
-
Japan Lifestyle:100 ఏళ్లు దాటినా చురుకుగానే ఉంటారు.. జపాన్ ప్రజల జీవనశైలిలో ప్రత్యేకత ఏంటి?
-
ACB Raids: ఆర్అండ్బీ ఈఎన్సీ మోహన్ నాయక్పై ఏసీబీ దాడులు.. 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.!
-
Supreme Court: పెళ్లికి ముందు శారీరక బంధంలో ఉంటే క్యారెక్టర్ను తప్పుపట్టలేం.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
-
Ben Stokes: బెన్ స్టోక్స్ నైట్క్లబ్ వివాదం.. అసలు ఏం జరిగింది?.. భద్రతా సిబ్బందికి కుట్లు పడటానికి కారణమేంటి?
-
West Nile Fever: డెంగ్యూ, మలేరియానే కాదు.. కేరళలో దోమ కాటుతో మరో ప్రాణాంతక వ్యాధి!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!