Ganesh Immersion Live Updates: హైదరాబాద్లో ఖైరతాబాద్ మహా గణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తజనుల సందడి మధ్య ఘనంగా కొనసాగుతుంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వినాయక నిమజ్జనోత్సవానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పది రోజుల పాటు పూజలందుకున్న గణనాథులను ఘనంగా సాగనంపడానికి నిర్వాహకులు కూడా సిద్ధమయ్యారు.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ మున్సిపల్ పరిధిలోని కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో జరిగిన వేలంలో రూ."కోటి 87 లక్షలు" ధర పలికిన గణపతి లడ్డూ ప్రసాదం.
గ్రామంలో కొనసాగుతున్న బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు.. కాసేపట్లో లడ్డూ వేలం కొనసాగనుంది.
ఎన్టీఆర్ మార్గ్ లో ట్యాంక్బండ్ కు గణేశ్ నిమజ్జనానికి వచ్చే విగ్రహాల నిర్వాహకులను డీజే సాంగ్స్, పాటలు ఆపేయాలని పోలీసుల ఆదేశాలు..
రాజ్ధూత్ వద్దకి చేరుకున్న ఖైరతాబాద్ గణనాథుడు.. ఎన్టీఆర్ మార్గ్ లో ఉన్న వాహనాలను క్లియర్ చేస్తున్న పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది.. విగ్రహాల నిమర్జనం ప్రక్రియను వేగవంత చేస్తున్న క్రెన్ ఆపరేటర్లు.. ఇందిరా గాంధీ విగ్రహం నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ రూట్ లల్లో ఉన్న 9 క్రేన్ ల వద్ద నిమజ్జనం వేగవంతం.. అనుకున్న సమయానికి ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేస్తామంటున్న అధికారులు
ట్యాంక్బండ్ పైన ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు.. హుస్సేన్ సాగర్పై ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్లో సీసీ కెమెరాల ద్వారా నిమజ్జన ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు
ప్రారంభమైన బాలాపూర్ వినాయకుడి శోభా యాత్ర.. బాలాపూర్ గ్రామంలో తిరిగిన అనంతరం లడ్డు వేలం పాట ప్రారంభం..
హైదరాబాద్: ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట.. బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలానికి కొత్త నిబంధనలు.. గతేడాది వేలం పలికినంత డబ్బును ముందే డిపాజిటి్ చేయాలని నిబంధన.. రూ. 27 లక్షల డిపాజిట్ చేసి వేలంలో పాల్గొంటున్న భక్తులు.. ఈసారి బాలాపూర్ గణేశుడి లడ్డూ రూ. 30 లక్షలు దాటుతుందని అంచన.. ప్రతిఏటా రికార్డులు సృష్టిస్తున్న బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంపాట..
ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనం కోసం సూపర్ క్రేన్.. 70 అడుగుల మహాగణపతి విగ్రహం కోసం బాహుబలి క్రేన్.. 350 టన్నుల బరువు ఎత్తేలా ఎన్టీఆర్ మార్గ్ లో భారీ క్రేన్.. 80 మీటర్ల పొడవు.. శంషాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన క్రేన్.. మధ్యాహ్నం 12 నుంచి మహాగణపతి నిమజ్జనం ప్రక్రియ ఏర్పాట్లు చేస్తున్న క్రేన్ సిబ్బంది.. 14 మంది ప్రత్యేక సిబ్బంది..
వడివడిగా ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర.. రెండున్నర కిలోమీటర్ల మేర సాగనున్న భారీ గణనాథుడి శోభాయాత్ర.. అనుకున్న సమయానికంటే ముందుగానే శోభాయాత్రం ప్రారంభం.. భారీ గణనాథుడిని వడివడిగా కదలిస్తున్న పోలీసులు.. ఇప్పటికే వందలాదిగా చేరుకున్న భక్తులు.. శోభాయాత్ర వెహికిల్ ముందు రెండు అంచెల్లో రోప్ పార్టీ ఏర్పాటు.. ఖైరతాబాద్ పురవీధుల వైపు భక్తులను అనుమతించని పోలీసులు.. భక్తులు వెహికిల్ ముందు పెద్ద సంఖ్యలో చేరుకుంటే.. గల్లి రోడ్ దాటేందుకు ఆలస్యం అవుతుందని భావిస్తున్న పోలీసులు.. టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకునే వరకు వడివడిగా శోభాయాత్ర..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష వినాయక విగ్రహాల నిమజ్జనం.. హుస్సేన్ సాగర్ లో 25 వేల నుంచి 30 వేల విగ్రహాలు నిమజ్జనం.. మొత్తం 25 వేల మంది పోలీసులతో బందోబస్తు.. హుస్సేన్ సాగర్ చుట్టూ 3 వేల మంది పహారా.. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో 12 షీటీమ్స్ పహారా.. సీటీ వ్యాప్తంగా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు.. జంట నగరాల్లో 67 డైవర్షన్ పాయింట్లు.. నిమజ్జనం పూర్తైనా వాహనాలు.. ఆర్టీసీ క్రాస్ రోడ్డువైపు మళ్లీంపు..
భద్రాద్రి: కొత్తగూడెం, ఇల్లందులో గణేశ్ నిమజ్జనాల సందడి.. భారీగా తరలివెళ్తున్న గణనాథులు..
ప్రారంభమైన ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర..
ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర.. 700 మంది పోలీసులతో భారీ బందోబస్తు.. శోభాయాత్ర మార్గంలో 56 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు.. సరికొత్త రికార్డ్ సృష్టించిన ఖైరతాబాద్ గణేశుడి ఆదాయం రూ. కోటి 10 లక్షలు.. హుండీ ద్వారా రూ. 70 లక్షల ఆదాయం.. ప్రకటనలు, హోర్డింగుల ద్వారా రూ. 40 లక్షల ఆదాయం.. 70 ఏళ్ల సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో.. 11 రోజుల పాటు పూజలందుకున్న ఖైరతాబాద్ గణేశుడు..
హైదరాబాద్: కాసేపట్లో ఖైరతాబాద్ సప్తముఖ మహాశక్తి గణపతి శోభాయాత్ర.. రెండున్నర కిలోమీటర్ల మేర సాగనున్న భారీ గణనాథుడి శోభాయాత్ర.. ఖైరతాబాద్, సెన్సేషనల్ థియేటర్, రాజ్ దూత హోటల్, టెలిఫోన్ భవన్.. తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం, ఎన్టీఆర్ మార్గ్ వరకు శోభాయాత్ర.. ఎన్టీఆర్ మార్గ్ 4వ నెంబర్ దగ్గర నిమజ్జనం కానున్న మహాగణపతి.. ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనం కోసం ప్రత్యేక సూపర్ క్రేన్.. మధ్యాహ్నం 2గంటలలోపు ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయ్యేలా ప్రణాళికలు..
బాలాపూర్ గణేశుడికి చివరిపూజ కార్యక్రమం.. పూర్తైన బాలాపూర్ గణేశుడి ఉద్వాసన పూజ.. ఊరేగింపు అనంతరం గ్రామ బొడ్రాయి వద్ద లడ్డూ వేలంపాట.. బాలాపూర్ గణనాథుడి లడ్డూ వేలానికి కొత్త నిబంధనలు.. గతేడాది వేలం పలికినంత డబ్బును ముందే డిపాజిట్ చేయాలని నిబంధన.. రూ. 27 లక్షల డిపాజిట్ చేసి వేలంలో పాల్గొంటున్న భక్తులు..