Constable Suicide: షేర్ మార్కెట్లో కోటి రూపాయల నష్టం..కానిస్టేబుల్ సూసైడ్!
- షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో కానిస్టేబుల్ సూసైడ్..
- మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేష్..
- షేర్ మార్కెట్లో నష్టం రావడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్
Constable Suicide: షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ.వెంకటేష్ అంబర్ పేట్ లోని దుర్గా నగర్లో గల తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, షేర్ మార్కెట్లో కోటి రూపాయల నష్టం రావడంతో మనస్థాపానికి గురైన కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కానిస్టేబుల్ వెంకటేష్ స్వస్థలం సూర్యాపేట జిల్లా.. కాగా, అతడికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు.
Read Also: TDP Politburo: నేడు టీడీపీ పొలిట్బ్యూరో భేటీ.. లోకేష్ టీమ్ రెడీ అవుతుందా..?
Also Read
- B.Tech Student: పాపం ఏం కష్టమొచ్చిందో.. డీజిల్ పోసుకొని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..
- Explore to Expand: తెలంగాణ టూ గ్లోబల్.. 'ఎక్స్ప్లోర్ టు ఎక్స్పాండ్' వేదికను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్ బాబు
- Revanth Reddy: ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి 'బంపర్ గిఫ్ట్'.. 100 రోజుల్లో రూ. 6 వేల కోట్లు క్లియర్!
- Cyber Crime: బెట్టింగ్ రాయుళ్లపై సైబర్ క్రైమ్ పంజా.. 181 సోషల్ మీడియా ప్రొఫైల్స్ క్లోజ్!
అయితే, 2024లో ఆంధ్రాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో స్కూల్ హెడ్ మాస్టర్గా పని చేస్తున్న భాస్కర్ బాబు స్నేహితులను నమ్మి షేర్ మార్కెట్, ఆన్ లైన్ బిజినెస్లో భారీగా పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మిన భాస్కర్ లోన్ యాప్లు, బ్యాంకులు, సన్నిహితుల దగ్గర అప్పు చేసి మరీ రూ. 60 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. కొంతకాలం పాటు లాభం పేరుతో నెలనెలా డబ్బులు ఇచ్చిన స్నేహితులు 2024 ఏప్రిల్ నుంచి ఎలాంటి లాభం, అసలు కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో అప్పుల భారం పెరిగి బ్యాంకులు, లోన్ యాప్లకు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఒక పక్క ఈఎంఐల టెన్షన్, మరో పక్క అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి రావడంతో.. ఆ బాధలు భరించలేక డిసెంబర్ 22, 2024న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
-
AK47: ‘ఆదర్శకుటుంబం’ షూటింగ్ అప్ డేట్..
-
SRH vs KKR: సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా హెడ్ టు హెడ్ రికార్డ్స్.. ఇప్పటివరకు కేకేఆర్దే పైచేయి
-
Vijay TVK Plan B: రేపు ఫలితాలు.. విజయ్ ‘ప్లాన్-బి’ రెడీ.. అభ్యర్థులకు దళపతి సీరియస్ వార్నింగ్!
-
NBK112 : CM రేసులో నందమూరి బాలకృష్ణ
-
Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!