Constable Suicide: షేర్ మార్కెట్లో కోటి రూపాయల నష్టం..కానిస్టేబుల్ సూసైడ్!
- షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో కానిస్టేబుల్ సూసైడ్..
- మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటేష్..
- షేర్ మార్కెట్లో నష్టం రావడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Constable Suicide: షేర్ మార్కెట్ లో కోటి రూపాయల నష్టం రావడంతో హైదరాబాద్ లో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అంబర్ పేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఏ.వెంకటేష్ అంబర్ పేట్ లోని దుర్గా నగర్లో గల తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, షేర్ మార్కెట్లో కోటి రూపాయల నష్టం రావడంతో మనస్థాపానికి గురైన కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడు కానిస్టేబుల్ వెంకటేష్ స్వస్థలం సూర్యాపేట జిల్లా.. కాగా, అతడికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు.
Read Also: TDP Politburo: నేడు టీడీపీ పొలిట్బ్యూరో భేటీ.. లోకేష్ టీమ్ రెడీ అవుతుందా..?
Also Read
అయితే, 2024లో ఆంధ్రాలో కూడా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కూడేరు మండలంలో స్కూల్ హెడ్ మాస్టర్గా పని చేస్తున్న భాస్కర్ బాబు స్నేహితులను నమ్మి షేర్ మార్కెట్, ఆన్ లైన్ బిజినెస్లో భారీగా పెట్టుబడి పెట్టాడు. పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మిన భాస్కర్ లోన్ యాప్లు, బ్యాంకులు, సన్నిహితుల దగ్గర అప్పు చేసి మరీ రూ. 60 లక్షలు పెట్టుబడి పెట్టాడు.. కొంతకాలం పాటు లాభం పేరుతో నెలనెలా డబ్బులు ఇచ్చిన స్నేహితులు 2024 ఏప్రిల్ నుంచి ఎలాంటి లాభం, అసలు కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో అప్పుల భారం పెరిగి బ్యాంకులు, లోన్ యాప్లకు ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడ్డాడు. ఒక పక్క ఈఎంఐల టెన్షన్, మరో పక్క అప్పులు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి రావడంతో.. ఆ బాధలు భరించలేక డిసెంబర్ 22, 2024న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?