KTR: రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను..
- సొంత నియోజకవర్గం మీద ముఖ్యమంత్రికి పట్టు లేదు..
- రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నా..
- వాళ్లు ఐదేళ్లు ఉంటేనే బీఆర్ఎస్ మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటాం: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్టీవీతో ఫేస్ టూ ఫేస్ లో మాట్లాడుతూ.. సొంత నియోజకవర్గం మీద కూడా పట్టు లేని నువ్వు అసలు ఏం ముఖ్యమంత్రి అని ప్రశ్నించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక భూముల ధరలు భారీగా పెరిగాయి.. రైతులకు ఆ భూములే ఆసరా అయ్యాయి.. అలాంటి భూములను గుంజుకుంటా అంటే వారికి కోపం రాదా?.. అధికారం పోయిందని నాకు ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేదు.. అసలు అధికారం వస్తుందని కలలో కూడా నేను ఊహించలేదు.. కానీ, 10 ఏళ్లు ప్రజలు మాకు అవకాశం ఇవ్వటాన్ని అదృష్టంగా భావించానని ఆయన అన్నారు. అలాగే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను.. వాళ్లు పూర్తి కాలం అధికారంలో ఉంటేనే కదా.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీ 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందన్నారు. ఎన్నికల సంస్కరణాలు చేస్తే ఒక వ్యక్తి రెండు టర్ముల కన్నా ఎక్కువ సార్లు సీఎం, పీఎం ఉండొద్దని నేను విజ్ఞప్తి చేస్తానని కేటీఆర్ పేర్కొన్నారు.
Read Also: Jeff Bezos Marriage: అమెజాన్ వ్యవస్థాపకుడు రెండో పెళ్లి.. క్రిస్మస్ రోజున ప్రియురాలితో వివాహం
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- Rail Parcel App: గుడ్న్యూస్.. అందుబాటులోకి రైల్వే పార్సిల్ యాప్.. ఇకపై ఇంటి నుంచే పికప్, డెలివరీ
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
- CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
అలాగే, రాష్ట్రంలో మార్పు అనేది వచ్చింది.. కానీ అది మంచి మార్పు కాకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే మార్పు అయ్యింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఫార్మాసిటీ కోసం మేము సేకరించిన ల్యాండ్ అంతా కూడా కండిషనల్ ల్యాండ్.. ఆ భూమిని వేరే అవసరాలకు వాడటానికి వీలు లేదు.. కానీ రేవంత్ రెడ్డి హైకోర్టును కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు.. కోర్టులో ఫార్మాసిటీ ఉందంటాడు.. బయట రద్దైందని అంటాడు.. అసలు ఫోర్త్ సిటీ కోసం ఈ ప్రభుత్వం ఒక్క ఎకరాం ల్యాండ్ అయినా సేకరించిందా? అని ఆయన ప్రశ్నించారు. ఫార్మాసిటీ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తే ఊరుకోం.. ప్రజలను ఎప్పటికీ మోసం చేస్తామంటే కుదరదు.. నేను ఢిల్లీ కి పోయి కాంగ్రెస్ వాళ్ల మీద ఫిర్యాదు చేశా.. బీజేపీతో దోస్తీ మాకు అవసరం లేదు.. కానీ కాంగ్రెస్ వాళ్లు ఇక్కడ గల్లీల్లోనే బీజేపీతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు అని ఆరోపించారు. రేవంత్ కి నేనంటే చాలా ప్రేమ ఉన్నట్లు ఉంది.. అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని కేటీఆర్ తెలిపారు.
- Tags
- BRS
- congress
- hyderabad
- ktr
- revanth reddy
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!