CM Revanth Reddy: వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం..
- పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..
- విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు ఇకపై రూ.కోటి నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కోటి రూపాయలు అందజేస్తామన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ లకు కోటి 25 లక్షలు, డీఎస్పీ అడిషనల్ ఎస్పీ, ఎస్పీ లకు కోటి 50 లక్షలు, ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్లు, శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు ర్యాక్ అధికారులను బట్టి వారికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామన్నారు. పోలీసులు సమాజానికి రోల్ మోడల్స్ అన్నారు. పోలీసులు ఎవరు ఎదుట చేయి చాపకూడదన్నారు. హుందాగా గౌరవంగా బతుకుదామన్నారు. పోలీస్ శాఖను ప్రతిపక్షాలు గమనిస్తుంటాయన్నారు.
Read also: CM Revanth Reddy: మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతాం.. సికింద్రాబాద్ ఆలయ ఘటనపై సీఎం సీరియస్
Also Read
క్రిమినల్స్ తో పోలీసులు ఫ్రెండ్లీ గా ఉండడం కాదన్నారు. బాధితులతో ఫ్రెండ్లీ గా ఉండాలి.. క్రిమినల్స్ విషయం లో పోలీసులు కఠినంగా వ్యవహారించాలన్నారు. పోలీస్ కుటుంబాలు కోసం యంగ్ ఇండియా స్కూల్ ను ఈరోజు ప్రారంభిస్తున్నామన్నారు. 50 ఎకరాల విస్తీర్ణం లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు పునాది వేస్తున్నామన్నారు. వచ్చే అకాడమీ నుండి విద్యా సంస్థ ప్రారంభిస్తున్నామని తెలిపారు. నేరగాళ్ల పట్ల కఠినంగా వ్యవహారించాలన్నారు. పోలీస్ సమస్యలు ఏమున్నా నా దగ్గరికి తీసుకువస్తే నేను పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గ్రేహౌండ్ అది ప్రవీణ్ జూనియర్ కమాండర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి ప్రభుత్వం అండగా వుంటుందని తెలిపారు.
Read also: KTR Tweet Viral: రైతు బంధు, జీఎస్టీ పై కేటీఆర్ ట్వీట్ వైరల్..
తెలంగాణ డీజీపీ జితేందర్ మట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మొత్తం 214 మంది పోలీసులు అమరులు అయ్యారని తెలిపారు. తెలంగాణ రాష్టం నుండి 1 పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారన్నారు. అదే ప్రవీణ్ అనే కానిస్టేబుల్ అమరుడు అయ్యాడని తెలిపారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహా సహకారాలు అందించిందని తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ శాంతి భద్రతల విషయం లో ఎక్కడ రాజీ పడడం లేదన్నారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ ఏర్పాటు వాటికి కావాల్సి సౌకర్యాలు అన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. సైబర్ నేరాలను అరికట్టడం లో తెలంగాణ పోలీస్ శాఖ ముందు వరుసలో ఉందని తెలిపారు.
Hyderabad Crime: బాచుపల్లిలో దారుణం.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!