Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Cm Revanth Reddy At The 3rd Death Anniversary Of Former Cm Rosaiah

CM Revanth Reddy: రోశయ్య వల్లే అప్పటి ముఖ్యమంత్రులు ప్రశాంతంగా పనిచేశారు..

Published Date :December 4, 2024 , 1:15 pm
By Bhanu
  • మాజీ సీఎం రోశయ్య 3వ వర్థంతి కార్యక్రమంలో సీఎం ..
  • ట్రబుల్‌ షూటర్‌గా రోశయ్య కీలక పాత్ర పోషించబట్టే వైఎస్సార్‌ పని ఈజీ ..
  • ఇరిగేషన్ శాఖపై బాగా మాట్లాడుతున్నావని రోశయ్య నన్ను ప్రోత్సహించారు..
CM Revanth Reddy: రోశయ్య వల్లే అప్పటి ముఖ్యమంత్రులు ప్రశాంతంగా పనిచేశారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

CM Revanth Reddy: రోశయ్య వ్యవహారాలను చక్కపెట్టేవారు కాబట్టే.. అప్పటి ముఖ్యమంత్రులు ప్రశాంతంగా పనిచేశారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ సీఎం రోశయ్య 3వ వర్థంతి కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణ శాసనసభలో రోశయ్య లా వ్యూహాత్మకంగా సమస్యను పరిష్కరించే నాయకుడు లేరన్న లోటు కనిపిస్తోందని సీఎం రేవంత్ అన్నారు. సందర్భం, సమయం వచ్చినప్పుడు సోనియాగాంధీ రోశయ్యని ఎంపిక చేశారని తెలిపారు. పార్టీ కోసం ఆయన ఎంత నిబద్ధతగా పనిచేశారో అందుకు నిదర్శనం అని రేవంత్ రెడ్డి అన్నారు. ట్రబుల్‌ షూటర్‌గా రోశయ్య కీలక పాత్ర పోషించబట్టే వైఎస్సార్‌ పని ఈజీ అయ్యేదని తెలిపారు. రోశయ్య ఉన్నప్పుడు నెంబర్‌-2 ఆయనే.. నెంబర్‌ 1 మాత్రమే మారేవారని తెలిపారు. నెంబర్‌ 2లో ఉన్నా.. ఆయన ఎప్పుడూ తన పైన ఉన్నవారిని దాటిపోవాలని అనుకోలేదని సీఎం అన్నారు.

Read also: HYDRA : హైడ్రా కీలక నిర్ణయం.. పబ్లిక్ ఆస్తుల పరిరక్షణలో కొత్త కార్యక్రమం

Also Read

  • MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
  • Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
  • Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
  • CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ.!

ఏరోజు కూడా తనకు ఈ పదవి కావాలని రోశయ్య అడగలేదని సీఎం అన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, క్రమశిక్షణ వల్లనే ఆయనకు పదవులు వచ్చాయని తెలిపారు. 2007లో నేను శాసన మండలిలో సభ్యుడుగా ఉన్నప్పుడు నాకు కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇరిగేషన్ శాఖపై బాగా మాట్లాడుతున్నావని నన్ను ప్రోత్సహించారన్నారు. లైబ్రరీకి వెళ్లి మరింత సమాచారం సేకరించి మాట్లాడితే బాగుంటుందని సూచన చేశారని సీఎం తెలిపారు. నాకు సూచనలు ఇచ్చిన రోశయ్యని అనుసరించి.. ఒకానొక సందర్భంలో ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కల్పించానని తెలిపారు. అప్పుడు రోశయ్య ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలని, అధికార పక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలని సూచన చేశారని తెలిపారు. ఇప్పుడు అలాంటి స్ఫూర్తి చట్టసభల్లో లోపించిందని సీఎం అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పక్షానికి ఏదో పోతుందని రీతిగా మారిందని అన్నారు.

Read also: Paracetamol : భారత్ లోనే తయారీ.. అతితక్కువ ధరకే లభించనున్న పారాసెటమాల్

ఏ ఒక్కరోజు రోశయ్య పదవుల కోసం పోటీ పడలేదన్నారు. ఆయన ప్రతిభను చూసి పదవులే ఆయన దగ్గరికి వచ్చాయన్నారు. అది మంత్రి పదవి అయినా.. ముఖ్యమంత్రి పదవి అయినా.. గవర్నర్ పదవి అయినా.. అధిష్టానం పిలిచి ఇచ్చిందని గుర్తు చేశారు. నిఖార్సైన అయినా హైదరాబాది రోశయ్య అన్నారు. హైదరాబాదులో ఆయన విగ్రహం లేకపోవడం లోటే అన్నారు. సీఎంగా రోశయ్య ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో నేను వెళ్లి కలిశానని అన్నారు. ఆ సందర్భంగా రోశయ్య మాకు ఒక విషయం చెప్పారు.. నాకు చీరాలలో ఆస్తులు లేవు, ఉన్నది అమ్ముకుని హైదరాబాదులో ఇల్లు కట్టుకున్న అన్నారు. నాకు ఆంధ్ర-తెలంగాణ రెండు ఒకటే అని చెప్పారని గుర్తుచేశారు. ఆర్యవైశ్యులకు ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించే అంశం అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్తా అని తెలిపారు.
HYDRA : హైడ్రా కీలక నిర్ణయం.. పబ్లిక్ ఆస్తుల పరిరక్షణలో కొత్త కార్యక్రమం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • CM Revanth Reddy at the 3rd death anniversary of former CM Rosaiah
  • Former CM Rosaiah
  • the 3rd death anniversary

తాజావార్తలు

  • MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!

  • AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..

  • PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్

  • Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..

  • Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions