CM Revanth Reddy: 2021లో జరగాల్సిన జనాభా లెక్కలను కేంద్రం ఇంకా చేయలేదు..
- బీసీ నేతలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు..
- ఎవరు అడగక ముందే రాహుల్ గాంధీ కులగణనకు డిమాండ్ చేశారు..
- 2021లో జరగాల్సిన జనాభా లెక్కలను కేంద్రం ఇంకా చేయలేదు: సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: బీసీ నేతలు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బలహీన వర్గాల లెక్క తేలాలని కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు.. బీసీలు తెలిపే అభినందనలు నాకు కాదు రాహుల్ గాంధీకి అందివ్వాలన్నారు. ఎవరు అడగక ముందే రాహుల్ గాంధీ కులగణన డిమాండ్ చేశారు.. ఆయన చెప్పినట్లుగానే కులగణన చేశామన్నారు. దాంతో పాటు అధికారంలోకి వస్తే.. రిజర్వేషన్లు పెంచుతామని మాట ఇచ్చారు.. ఇప్పుడు చేశామని పేర్కొన్నారు. ఇక, 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కూడా చేయలేదు కేంద్రం.. చట్టబద్ధత లేని లెక్కలతో రిజర్వేషన్ పెంచలేమని సుప్రీం కోర్టు చెప్పింది.. అందుకే బీసీలు ఎంత మంది ఉన్నారో తేల్చే పని మనం చేశామని వెల్లడించారు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.. బీసీల సహకారంతో ప్రభుత్వం వచ్చింది.. మీ సహకారం.. మేము ఏడాదిలోనే అమలు చేశామని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Read Also: Nagpur Violence: నాగ్పూర్ హింస ఒక “కుట్ర”.. “ఛావా”పై షిండే కామెంట్స్..
Also Read
- KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
- Nitin Nabin : తెలంగాణలో త్వరలోనే 'కమలం' వికసిస్తుంది.. వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
- HYDRAA: వర్షం పడితే మునిగిపోవడానికి అసలు కారణం ఇదే.. కాలువల్లో లారీల కొద్దీ సోఫాలు, పరుపులు..రంగంలోకి ‘హైడ్రా’!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
ఇక, ఫిబ్రవరి 4వ తేదీన సోషల్ జస్టిస్ డేగా ప్రకటించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సబ్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డినీ వేశాం.. ఎట్లా న్యాయం చేస్తారని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ సీనియర్ నేత.. అధికారులకు చెప్పి చేయించే వ్యక్తి.. అధికారులు ఎట్లా ఉంటారో తెలుసు కదా.. ఎటు అంటే అటు బెండ్ చేస్తారు.. అందుకే చట్టం తెలిసిన వ్యక్తి కాబట్టి.. అందుకే ఉత్తమ్ అన్నని కమిటీ ఛైర్మన్ చేశామన్నారు. డెడికేషన్ కమిటి వేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.. ఇది పెద్ద సమస్య కాదు.. దీన్ని కొట్టేయిద్దమన్నారు అధికారులు.. కానీ, డెడికేషన్ కమిషన్ వేయండి అని కమిట్మెంట్ ఉన్న వ్యక్తిని నియమించాం.. రెండో విడత అవకాశం ఇచ్చినా.. కొందరు దుర్బుద్ధితో నమోదు చేసుకోలేదు.. మేము చేసే పాలసీ, ఎక్కడ టెస్ట్ పెట్టినా నిలబడాలి అనేదే మా ఆలోచన..
రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తాయి.. సహజమే.. వాటిని తప్పు పట్టలేమన్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి సర్వే చేయాలన్న తెలంగాణకి వచ్చి అధ్యాయనం చేసేలా ఉండాలనేది మా ఆలోచన అని రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!