MP Raghunandan Rao: మదర్సలోని పిల్లలకు హిందూ సమాజంపై ద్వేషం ఎందుకు..?
- తెలంగాణ డీజీపీలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు భేటీ..
- మదర్సలోని పిల్లలకు ఏం నేర్పస్తున్నారో డీజీపీ, సీఎస్ కనిపెట్టాలి..
- మదర్సలోని పిల్లలకు హిందూ సమాజంపై ద్వేషం ఎందుకు?: ఎంపీ రఘునందన్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Raghunandan Rao: తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డితో మెదక్ ఎంపీ రఘునందన్ రావు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో శివాలయం ధ్వంసం చేసిన పోలీసులు సకాలంలో స్పందించలేదని తెలిపారు. ఘటన మధ్యాహ్నం జరిగితే రాత్రి దాకా పోలీసులు రాలేదు.. కేవలం హిందువుల మీద 4 ఎఫ్ఐఆర్లు పెట్టారు.. నాలుగు పేర్లు రాసి ఆదర్స్ అని రాసి బీజేపీ, హిందూ కార్యకర్తలను ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు.. పక్కన ఉన్న మదర్సాలోని పిల్లలను కూడా హిందువులే పోలీసులకు అప్పజెప్పారు.. ఇప్పటికే 19 మంది జైలుకు పోయారు.. ఇంకా అరెస్ట్ చేస్తూనే ఉన్నారు.. సీసీ కెమెరాలు బాగున్నాయి.. కమాండ్ కంట్రోల్ ఉందని పోలీసులు.. రాత్రి దాకా ఎందుకు స్పందించలేదు అని డీజీపీని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.
Read Also: TFJA: తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ‘ఐ స్క్రీనింగ్’… అద్భుత స్పందన
Also Read
అయితే, అక్కడ మదర్సలోఉన్న పిల్లలు ఈ దేశం పిల్లలు అని మీ ఎస్పీ చెప్పగలరా అని ఎంపీ రఘునందన్ రావు అడిగారు. టోపీ పెట్టుకుంటే మనోడు అని కాపాడుతున్నారు.. అక్కడ మదర్సలో ఉండే 12 ఏండ్లలోపు పిల్లలకు హిందూ సమాజంపై ద్వేషం ఎందుకు..? అని ప్రశ్నించారు. అక్కడ విగ్రహం పగిలిన తర్వాత మదర్స పిల్లలు లోపలికి పోయి వచ్చిన వీడియోలు ఎందుకు బయటకు రావు అని మండిపడ్డారు. రామాలయం జాగాలో మదర్స ఎట్లా వచ్చింది కలెక్టర్.. ఆ మదర్సలో ఉన్నోళ్లు ఏ దేశం వాళ్ళో చెప్పండి అని డిమాండ్ చేశారు. శివ నగర్, సదాశివ పేటలో ఉన్నట్టు వంటి మదర్సలో ఉన్నోళ్లు ఏ దేశం వాళ్ళు అని అడిగారు. దీంతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతీ మదర్సలోని వారందరూ ఏ రాష్ట్రం, ఏ దేశం వాళ్ళు.. వారికి ఏం నేర్పిస్తున్నారో సీఎస్, డీజీపీ చూడాలన్నారు. ఇక, ముత్యాలమ్మ దేవాలయం సంఘటన తర్వాత మీ ఇంటెలిజెన్స్ ఎందుకు వైఫల్యం చెందింది.. అక్కడ ఏం జరిగిందని గుమిగూడిన అందరినీ రిమాండ్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని రఘునందన్ రావు పేర్కొన్నారు.
Read Also: India Pakistan: పాకిస్తాన్లో వధువు, బోర్డర్లో వరుడు.. పెళ్లి కష్టమే..
ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తెలంగాణతో పాటు హైదరాబాద్ లో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్, రోహింగ్యాలను వెళ్లగొట్టకపోతే భాగ్య నగరం మండుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. హైదరాబాద్ లో 70 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని అంటున్నారు.. ఇంతకీ ఏం జరుగుతున్నాదని ప్రశ్నించారు. గతంలో డీజీపీ ఆఫీసు మీద బురఖాలో వచ్చి దాడి చేసిన ఘటనను మర్చిపోవద్దని గుర్తు చేశారు. అహింసో పరమో ధర్మో అనేది మా నినాదం కానీ మమ్మల్ని ఇబ్బంది పెడితే హింస ఉంటది అని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Idol Cleaning Tips : గణేష్ చతుర్థికి ఇంట్లోనే విగ్రహాలకు ఇలా కొత్త మెరుపు
-
Dhruv Vikram DV4: ఇన్ని రోజుల ‘DV4’ వివాదానికి ఎండ్ కార్డ్.. రమేష్ వర్మతోనే ధృవ్ విక్రమ్ సినిమా!
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్కు త్రిషా కృష్ణన్.. విజయ్తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!