India Pakistan: పాకిస్తాన్లో వధువు, బోర్డర్లో వరుడు.. పెళ్లి కష్టమే..
- పహల్గామ్ దాడితో క్రాస్ బోర్డర్ పెళ్లిళ్లపై ప్రభావం..
- పెళ్లి కోసం బోర్డర్లో ఎదురుచూస్తున్న వరుడు..
- సింధ్ ప్రావిన్సులో వధువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ నిర్ణయం పెళ్లిళ్లపై ప్రభావం చూపిస్తోంది. 1947లో దేశ విభజన జరిగినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా మంది పాకిస్తాన్ అమ్మాయిని లేదా అబ్బాయిని వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరిపై పహల్గామ్ ఎటాక్ ప్రభావం పడింది.
Also Read
- E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
Read Also: CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం..
రాజస్థాన్కి చెందిన షైతాన్ సింగ్ నాలుగు ఏళ్ల క్రితం పాకిస్తాన్లోని సింధు ప్రావిన్సుకు చెందిన కేసర్ కన్వర్తో ఎంగేజ్మెంట్ జరిగింది. వరుడి కుటుంబం వీసా కోసం అప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గురువారం ప్రభుత్వం అట్టారీ సరిహద్దుని మూసేయడంతో వివాహానిక మరో అడ్డంకి ఎదురైంది. పెళ్లికి సంబంధించి కొత్త బట్టలు సిద్ధం చేసుకుని, ఏప్రిల్ 30న పాకిస్తాన్లోని అమర్కోట్లో అమ్మాయి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం బార్మర్ జిల్లా నుంచి అట్టారికి బయలుదేరాడు. కానీ, వరుడి కుటుంబం అక్కడికి చేరుకునే సమయానికి బుధవారం అట్టారీ-వాఘా సరిహద్దు మూసేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు ఎవరిని సరిహద్దు దాటేందుకు అనుమతించడం లేదు.
ఈ దాడి రెండు కుటుంబాలపై ప్రభావం చూపించిందని వరుడి బంధువు సురేంద్ర సింగ్ అన్నారు. పాకిస్తాన్ నుంచి మా బంధువులు ఇక్కడికి వచ్చారు, వారు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని, దీంతో తాము చాలా నిరాశ చెందామని చెప్పారు. ఉగ్రదాడులు చాలా నష్టాన్ని కలిగిస్తాయని, సంబంధాలను దెబ్బతీస్తాయని అన్నారు. సైతాన్ సింగ్ వీసా మే 12 వరకు ఉంది. సకాలంలో సరిహద్దు తెరిస్తే వివాహం జరుగొచ్చని కుటుంబం అనుకుంటోంది. రాజస్థాన్లోని సోధా రాజ్పుత్ కమ్యూనిటీకి పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సుతో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో సరిహద్దులు దాటి ఇలా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతారు.
తాజావార్తలు
-
Balochistan: ముక్కలైన పాకిస్థాన్? స్వాతంత్ర్యం ప్రకటించుకున్న బలూచిస్థాన్.. 11 భాషల్లో లౌకిక రాజ్యాంగం!
-
PCODతో ఇబ్బందా.? మెంతులు-దాల్చినచెక్క టీతో ఇన్సులిన్ బ్యాలెన్స్.!
-
iQOO నుంచి మరో బీస్ట్ ఫోన్.. 9,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 రేటింగ్తో వచ్చేస్తున్న Neo 11S.!
-
Virat Kohli: కోహ్లీకి కోపం వస్తుంది.. క్రికెట్ బోరింగ్గా మారిపోతుంది.. మాజీ అంపైర్ అనిల్ చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Mrunal Thakur: డీప్ఫేక్ ఫోటోలపై మృణాల్ ఠాకూర్ ఆగ్రహం.. వెంటనే తొలగించండి, లేదంటే చట్టపరమైన చర్యలే!
ట్రెండింగ్
-
OnePlus స్మార్ట్ఫోన్లపై వేల రూపాయల తగ్గింపు.. Independence Day Saleలో ఇయర్బడ్స్, ట్యాబ్లెట్లపై కూడా భారీ డిస్కౌంట్లు.!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!