India Pakistan: పాకిస్తాన్లో వధువు, బోర్డర్లో వరుడు.. పెళ్లి కష్టమే..
- పహల్గామ్ దాడితో క్రాస్ బోర్డర్ పెళ్లిళ్లపై ప్రభావం..
- పెళ్లి కోసం బోర్డర్లో ఎదురుచూస్తున్న వరుడు..
- సింధ్ ప్రావిన్సులో వధువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Pakistan: పహల్గామ్ దారుణమై ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, పాకిస్తాన్తో అన్ని సంబంధాలను తెంచుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇక పాకిస్తాన్తో సరిహద్దును మూసేయాలని నిర్ణయించింది. పాకిస్తాన్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. ప్రస్తుతం ఈ నిర్ణయంతో అట్టారీ -వాఘా సరిహద్దులో రద్దీ నెలకొంది. పాక్ జాతీయులు వారి దేశానికి వెళ్లేందుకు బారులు తీరారు.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ నిర్ణయం పెళ్లిళ్లపై ప్రభావం చూపిస్తోంది. 1947లో దేశ విభజన జరిగినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని చాలా మంది పాకిస్తాన్ అమ్మాయిని లేదా అబ్బాయిని వివాహం చేసుకుంటున్నారు. ఇప్పుడు వీరిపై పహల్గామ్ ఎటాక్ ప్రభావం పడింది.
Also Read
- Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
- Neha Pachisia: నేహా పచిసియా ఎవరు? ఎయిర్ హోస్టెస్ నుంచి పోలీస్ అధికారిణిగా.. ఇప్పుడు సస్పెన్షన్ ఎందుకు?
- Suitcase Torso Case: సూట్కేసులో మొండెం కేసులో కొత్త ట్విస్ట్.. శరీర భాగాలతో బిర్యానీ వండి..!
- Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ..
Read Also: CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం..
రాజస్థాన్కి చెందిన షైతాన్ సింగ్ నాలుగు ఏళ్ల క్రితం పాకిస్తాన్లోని సింధు ప్రావిన్సుకు చెందిన కేసర్ కన్వర్తో ఎంగేజ్మెంట్ జరిగింది. వరుడి కుటుంబం వీసా కోసం అప్పటి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గురువారం ప్రభుత్వం అట్టారీ సరిహద్దుని మూసేయడంతో వివాహానిక మరో అడ్డంకి ఎదురైంది. పెళ్లికి సంబంధించి కొత్త బట్టలు సిద్ధం చేసుకుని, ఏప్రిల్ 30న పాకిస్తాన్లోని అమర్కోట్లో అమ్మాయి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. మంగళవారం బార్మర్ జిల్లా నుంచి అట్టారికి బయలుదేరాడు. కానీ, వరుడి కుటుంబం అక్కడికి చేరుకునే సమయానికి బుధవారం అట్టారీ-వాఘా సరిహద్దు మూసేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు ఎవరిని సరిహద్దు దాటేందుకు అనుమతించడం లేదు.
ఈ దాడి రెండు కుటుంబాలపై ప్రభావం చూపించిందని వరుడి బంధువు సురేంద్ర సింగ్ అన్నారు. పాకిస్తాన్ నుంచి మా బంధువులు ఇక్కడికి వచ్చారు, వారు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని, దీంతో తాము చాలా నిరాశ చెందామని చెప్పారు. ఉగ్రదాడులు చాలా నష్టాన్ని కలిగిస్తాయని, సంబంధాలను దెబ్బతీస్తాయని అన్నారు. సైతాన్ సింగ్ వీసా మే 12 వరకు ఉంది. సకాలంలో సరిహద్దు తెరిస్తే వివాహం జరుగొచ్చని కుటుంబం అనుకుంటోంది. రాజస్థాన్లోని సోధా రాజ్పుత్ కమ్యూనిటీకి పాకిస్తాన్ సింధ్ ప్రావిన్సుతో కుటుంబ సంబంధాలు ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో సరిహద్దులు దాటి ఇలా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతారు.
తాజావార్తలు
-
Raaka: ‘బన్నీని ఇలా ఎప్పుడూ చూడలేదు’.. ‘రాకా’ సెట్ చూసి షాకైన మంచు లక్ష్మి
-
Regina Cassandra : హీరోయిన్ నుండి విలన్ పాత్రలకు షిఫ్ట్ అయిన రెజీనా కాసాండ్రా
-
OPPO Find X9s: సగం ధరకే ఒప్పో Find X9s.. 12GB RAM, 50MP కెమెరా, 7025mAh బ్యాటరీతో ప్రీమియం 5G ఫోన్
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!