Mallu Bhatti Vikramarka: రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది..
- రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చింది..
- రాష్ట్రవ్యాప్తంగా అందరూ రైతుల ఖాతాల్లోకి క్షణాల్లో డబ్బులు జమవుతున్నాం..
- వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్టు మాఫీ చేస్తున్నాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mallu Bhatti Vikramarka: లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని ఇవాల మధ్యాహ్నం అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. రెండో దశలో దాదాపు 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నారు. రుణమాఫీని మూడు విడతల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయన్నారు.
Read also: Friends Rape: సాఫ్ట్వేర్ ఇంజినీర్పై స్నేహితుల సామూహిక అత్యాచారం.. హోటల్ కు తీసుకుని వెళ్లి..
Also Read
- Heavy Rain Alert: కాసేపట్లో హైదరాబాద్లో కుండపోత.. అత్యవసరమైతేనే బయటకు రండి.!
- CM Revanth Reddy : ఏపీలో రూ.10 వేల కోట్ల బకాయిలు.. అక్కడ ఎందుకు ప్రశ్నించరు.?
- CM Revanth Reddy : హైడ్రా రద్దే లేదు.. కబ్జాదారులను వదిలేది లేదు.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్
- Heavy Rain Alert: తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులు భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్టు మాఫీ చేస్తున్నామన్నారు. డిక్లరేషన్ ప్రకటించినప్పుడు చాలామంది అనుమానాలను వ్యక్తం చేశారని తెలిపారు. సాధ్యం కాదనుకున్నవాళ్లకి మేం రుణమాఫీ చేసి చూపిస్తున్నామని తెలిపారు. 1580 కోట్లు రైతు బీమా కింద ప్రభుత్వమే కడుతుందన్నారు. క్రాఫ్ ఇన్స్యూరెన్స్ 1350 కోట్లు చేయబోతున్నామన్నారు. రాష్ట్ర రైతులకు ఇవాళ పండగ రోజని తెలిపారు. బీఆర్ఎస్ లక్ష రూపాయల రుణమాఫీ నాలుగు విడతల చేసిందని గుర్తు చేశారు. చివరి విడత సగం వదిలేసిందని తెలిపారు. సాధ్యం కాదనుకున్న వాళ్ళకి రుణమాఫీ చేసి చూపిస్తున్నామన్నారు.
Read also: Nirmal Crime: రన్నింగ్ బస్సులో మహిళపై అత్యాచారం.. నోట్లో గుడ్డలు కుక్కి..!
తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఇది చారిత్రక ఘట్టమని తెలిపారు. ఆనాడు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో దేశవ్యాప్తంగా రుణమాఫీ..అదే తరహాలో రేవంత్ అధ్యక్షతన 31,000 కోట్ల రుణమాఫీ చేస్తున్నారని తెలిపారు. అప్పులో ఉన్న రాష్ట్రాన్ని సరిదిద్దుకుంటూనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు. పంటల బీమాని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. పంటల బీమాని కొనసాగిస్తున్నామని.. ఎన్ని ఇబ్బందులు ఉన్న రైతు భరోసాని కూడా అమలు చేస్తామన్నారు. త్వరలోనే రైతు భరోసా విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. ఆయిల్ ఫార్మ్ పంటను ప్రోత్సహించాలని కోరారు.
Telangana Assembly: నిన్నటిలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దు.. సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి..
తాజావార్తలు
-
Priyanka Gandhi: ‘‘ అత్యాచార నిందితులకు మద్దతు’’.. ప్రహ్లాద్ జోషిపై ప్రియాంకాగాంధీ సంచలన వ్యాఖ్యలు..
-
Kalyana Lakshmi: కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ కోసం అడ్డదారులు.. గుట్టురట్టు చేసిన పోలీసులు..
-
Rahul Gandhi: ‘అత్యంత నీచమైన వ్యక్తి’.. కొత్త విద్యాశాఖ మంత్రిపై రాహుల్ గాంధీ ఫైర్
-
Kitchen Cleaning Hacks: మిక్సర్ బేస్ శుభ్రం చేసే బెస్ట్ ట్రిక్స్.. మురికి, దుర్వాసనకు గుడ్బై
-
Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!