KA Paul: బెట్టింగ్ యాప్స్లో సెలబ్రిటీలపై కేసు.. బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా..?
- బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన 29 మంది సెలబ్రిటీలపై ఈడీ కేసు నమోదు..
- బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా.. బాలకృష్ణ, కూటమి ఎమ్మెల్యేలపై కేసు పెట్టలేదా?..
- బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటే.. ఈవీఎంలను మేనేజ్ చేసి తెలంగాణ 8 ఎంపీ స్థానాల్లో గెలిచారు: కేఏ పాల్
KA Paul: బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ లాంటి 29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెట్టింగ్ యాప్ లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. బెట్టింగ్ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు వేశా.. న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, ఈ కేసులో బీజేపీతో ఉండే వాళ్ళను వదిలేస్తారా? అని ప్రశ్నించారు. బాలకృష్ణ పైన కేసు ఎందుకు నమోదు చెయ్యరు?.. కూటమి ఎమ్మెల్యేలపై కేసు పెట్టలేదా? అని అడిగారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కూని చేస్తుంది అని ఆరోపించారు. అలాగే, సిగాచి ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓనర్లను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు?.. ఇదే యూరోపియన్ దేశాల్లో జరిగి ఉంటే కఠిన చర్యలు ఉండేవి, ఇండియాలో మాత్రం బెయిల్స్ వస్తాయని కేఏ పాల్ సెటైర్లు వేశారు.
Read Also: Bihar Elections: గుర్తింపు కార్డుల్లో ఆధార్ ఎందుకు చేర్చలేదు.. ఈసీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం
Also Read
- Hyderabad: ఏటీఎంలో ఊపిరాడక మృతి.. ఉదయం 5:30కు లోపలికి.. గంట తర్వాత విగతజీవిగా!
- Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
- RTC Strike Ends: ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఇక సమ్మె క్లోజ్!
- IPS Transers : తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ల బదిలీ
అయితే, అదానీ, అంబానీలకు 15 లక్ష కోట్లు రుణమాఫీ చేస్తారు, కానీ పేదలకు మాత్రం ఏం చేయరు అని కేఏ పాల్ ప్రశ్నించారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అమ్ముడు పోయారు.. సూపర్ సిక్స్ గురించి అడిగితే నాలుక కొస్తారా?.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిని ప్రజలు కోరుకుంటే పెడుతాను అన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు.. ఇక, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో పెట్టుకున్నట్లే అన్నారు. బీఆర్ఎస్- బీజేపీ ఒక్కటే అని చెప్పుకొచ్చారు. 5 శాతం లేని బీజేపీ 8 సీట్లు ఎలా గెలిచింది.. ఎందుకో తెలుసా.. బీఆర్ఎస్, ఈవీఎంల మహిమ వల్లే 8 ఎంపీ సీట్లలో గెలిచిందన్నారు. పురంధేశ్వరికి డిపాజిట్ కూడా రాకూడదు, కానీ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలిచారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు.
తాజావార్తలు
-
BRS: కవిత కొత్త పార్టీపై బీఆర్ఎస్ సెటైర్.. డూప్లికేట్ కోల్గేట్, బిస్లెరీ ఫొటోలతో ట్వీట్..
-
Ajit Doval: ‘‘మనమంతా ఒకే పడవలోని ప్రయాణికులం’’.. ముస్లిం మేధావులతో అజిత్ దోవల్ కీలక భేటీ
-
Reliance Q4 FY26 Results: రిలయన్స్ ఇన్వెస్టర్లకు షాక్.. ఆదాయం పెరిగినా లాభం ఎందుకు తగ్గింది? అంబానీ రిపోర్ట్ కార్డ్ ఇదే!
-
Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ
-
Panama Canal: హార్మూజ్ జలసంది మూసివేత..! ఒక్కో ట్యాంకర్పై రూ.37 కోట్లు సంపాదిస్తున్న ఓ చిన్న దేశం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!