Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime Stories Bajaj Electronics As Target Of Upi Scams

DCP Narasimha: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ టార్గెట్ గా యూపీఐ మోసాలు.. అదుపులో 13 మంది

Published Date :September 9, 2024 , 1:13 pm
By Bhanu
  • యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు..
  • నాలుగు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ కు చెందిన 13 మంది నిందితుల అరెస్ట్..
DCP Narasimha: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ టార్గెట్ గా యూపీఐ మోసాలు.. అదుపులో 13 మంది
  • Follow Us :
  • google news
  • dailyhunt

DCP Narasimha: బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్ గా యూపీఐ మోసాలపై సైబరాబాద్ డీసీపీ నరసింహ ఉక్కుపాదం మోపారు. పక్కా సమాచారంతో యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ కు చెందిన 13 మంది నిందితులను అదుపులో తీసుకున్నారు. నిందితుల నుండి 1.72 లక్షల నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ సిసిఎస్, కేపీహెచ్బీ, మాదాపూర్, నార్సింగి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నామని సైబరాబాద్ డీసీపీ నరసింహ తెలిపారు. హైటెక్ యూపీఐ మోసాలకు పాల్పడుతున్న నిందితులను అదుపులో తీసుకున్నామని తెలిపారు.

Read also: Kalki Vinayakudu: కాంప్లెక్స్‌ను పోలిన మందిరం.. అశ్వత్థామగా వినాయకుడు! వీడియో వైరల్‌

Also Read

  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. 'గిరిదర్శక్'గా ఉద్యోగాలు!
  • Petrol Diesel Shortage: రాష్ట్రంలో మరోసారి పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల వద్ద భారీ క్యూలు!
  • Good News : పోలీసులకు గుడ్ న్యూస్.. స్పెషల్ లీవ్ ప్రకటించిన డీజీపీ
  • Crane Accident : శంకర్‌పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి

సైబరాబాద్ డీసీపీ నరసింహ మాట్లాడుతూ.. బజాజ్ ఎలక్ట్రానిక్స్‌ను టార్గెట్గా చేసుకొని యూపీఐ మోసాలకు పాల్పడిన రాజస్థాన్ ముఠాను అదుపులో తీసుకున్నామన్నారు. మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల రూపాయల యూపీఐ మోసాలకు ఈ ముఠా పాల్పడుతుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ పిర్యాదు మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని, ముందుగా వస్తువులు కొనడానికి ఎలక్ట్రానిక్స్ షోరూం లోకి రాజస్థానీ ముఠాలోని సభ్యులు వెళ్తారని ఆతరువాత.. విలువైన వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారన్నారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి బజాజ్ షోరూమ్ లోని క్యూఆర్ కోడ్‌ను రాజస్థాన్లోని సహచరులకు ఈ ముఠా సభ్యులు పంపుతున్నారని తెలిపారు. ఆ తరువాత అక్కడి నుండి క్యూఆర్ కోడ్ తో రాజస్థాన్లోని సహచర ముఠా సభ్యులు పంపుతున్నారని తెలిపారు.

Read also: Errabelli Dayakar Rao: మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయం.. ఎర్రబెల్లి హాట్ కామెంట్స్

ఎలక్ట్రానిక్ వస్తువులు డెలివరీ అయ్యాక పొరపాటున వేరే ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ చార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతున్నారని అన్నారు. రాజస్థాన్ కు చెందిన 20 నుండి 25 ఏళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారని వెల్లడించారు. యూపీఐ మోసాల ద్వారా కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుందన్నారు. గత రెండు నెలలుగా 1125 యూపీఐ ట్రాన్స్‌యాక్షన్స్‌ చేశారన్నారు. ఈ ముఠాకు చెందిన వారిలో హైదరాబాద్ కు చెందిన 13 మందిని పట్టుకున్నామన్నారు. రాజస్థాన్ కు ప్రత్యేక టీమ్ లను పంపిస్తున్నామని తెలిపారు. ఈ క్రైమ్ వెనకాల ఉన్న కింగ్ పిన్ ను పట్టుకుంటామని అన్నారు. ఈ యూపీఐ మోసాల వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉందని డీసీపి నరసింహ అనుమానం వ్యక్తం చేశారు.
Malla Reddy: నేను పార్టీ మారలేదు.. సమయం వచ్చినప్పుడు చెబుతా..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bajaj Electronics as target of UPI scams
  • Bajaj Electronics target
  • cyberabad police
  • DCP Narasimha
  • UPA scams

తాజావార్తలు

  • Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు సర్కార్ బంపర్ ఆఫర్.. ‘గిరిదర్శక్’గా ఉద్యోగాలు!

  • Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • Ashu Reddy Scam: డబ్బు అడిగితే ఆత్మహత్య చేసుకుంటానంది!

  • The Paradise: ‘ఆయా షేర్’ తర్వాత అనిరుధ్ నుంచి నెక్స్ట్ సెన్సేషన్.. ‘ది ప్యారడైజ్’ సెకండ్ సింగిల్‌కి డేట్ ఫిక్స్!

ట్రెండింగ్‌

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions