Old City of Hyderabad: పాతబస్తీలో దారుణం.. అన్నను బండరాయితో మోది చంపిన తమ్ముడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Old City of Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంద్రా నగర్ లో ఆంజనేయులును అతని తమ్ముడు సురేష్ కుమార్ బండ రాయితో తలపై మోదీ హత్య చేశాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చాంద్రాయణగుట్ట సిఐ ప్రసాద్ వర్మ వారి సిబ్బందితో కలిసి చేరుకొని క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరించారు. తమ్ముడు సురేస్ ను అదుపులో తీసుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు సురేష్ కుమార్ కొద్దీ కాలంగా మానసిక స్థితి సరిగ్గా లేదని మృతుడి, నిందితుడి తల్లి తెలిపింది. తాజాగా నిందితుడు అతని వదినపై కూడా దాడి చేస్తూ పిచ్చిగా ప్రవర్తించాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఘటన స్థలాన్ని ఏసీపీ ఫలక్ నుమా షేక్ జహంగీర్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నిందితుడు మానసిక స్థితి
సరిగా లేదని అతన్ని అదుపులో తీసుకున్నామని అన్నారు.
Also Read
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?