హైదరాబాద్ పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్ అయింది. ఈ ఘటనలో 60 సంవత్సరాల వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇంద్రా నగర్ లో ఆంజనేయులును అతని తమ్ముడు సురేష్ కుమార్ బండ రాయితో తలపై మోదీ హత్య చేశాడు. స్థానిక సమాచారంతో ఘటనాస్థలికి చాంద్రాయణగుట్ట సిఐ ప్రసాద్ వర్మ వారి సిబ్బందితో కలిసి చేరుకొని క్లూస్ టీం ను రప్పించి ఆధారాలు సేకరించారు.