Chandrababu and Revanth Reddy Meeting: రేపే ఏపీ, తెలంగాణ సీఎంల భేటీ.. వీటిపైనే ఫోకస్..!
- రేపే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం..
- హైదరాబాద్ వేదికగా తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్ సీఎంల భేటీ..
- కీలక అంశాలపై సాగనున్న చర్చలు..
- అజెండాపై ఇప్పటికే ఫోకస్ పెట్టిన రెండు రాష్ట్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu and Revanth Reddy Meeting: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. మరోవైపు.. ఈ రోజు హస్తిన పర్యటన ముగించి.. హైదరాబాద్లో అడుగుపెట్టనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.. ఇక, రేపు ప్రజా భవన్ వేదికగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు.. ఈ నెల ఆరో తేదీన భేటీ అవుదామనే ప్రతిపాదనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందుంచారు ఏపీ సీఎం.. దానికి అంగీకరించారు తెలంగాణ ముఖ్యమంత్రి.. అయితే, ఈ భేటీలో ఏ అంశాలపై చర్చ సాగనుంది అనేది ఆసక్తికరంగా మారింది..
Read Also: Odisha : జగన్నాథ ఆలయంలోని రత్నాల దుకాణం ఎప్పుడు ఓపెన్ అవుతుంది… దాని వెనుక రహస్యం ఏమిటి?
Also Read
- Hyderabad: ఆడపడుచు ఆనందం కోసం కిడ్నాప్ ప్లాన్.. అర్ధరాత్రి స్కెచ్ అమలు.. చివరికిలా..!
- CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!
- Rich Girls Trap Case: రిచ్ కిడ్స్ ట్రాప్ అండ్ రే*ప్ కేస్ లో సంచలన అంశాలు.. 25 మంది రిచ్ మైనర్ బాలికలను ట్రాప్ చేసి..
- Harish Rao : యూరియా అమ్మకాలపై ఆంక్షలు దారుణం..
ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన బకాయిలు ఏమున్నాయనే కోణంలో ఏపీ ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.. షెడ్యూల్ 9,10 పరిధిలోని సంస్థల విభజన.. ఆస్తుల పంపకాల వంటివి ఇంకా తేలాల్సి ఉంది. ఆర్టీసీ ఆస్తుల విభజన జరగకపోవడం కీలకమైన వ్యవహరంగా ఉంది. అలాగే ట్రాన్సుకో, ఉన్నత విద్యా మండలి, పట్టాణభివృద్ధి శాఖ పరిధిలోని ఏపీ హౌసింగ్ బోర్డు నుంచి కొన్ని వేల కోట్ల రూపాయల మేర పెండింగ్ బకాయిలు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏపీకి రావాల్సి ఉంది. ఈ అంశాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నట్టు సమాచారం.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉన్న క్రమంలో తెలంగాణ నుంచి రావాల్సిన నిధుల్లో కొంత మొత్తం వచ్చినా.. ఏపీకి కాస్తో కూస్తో ఆర్థిక ఊరట ఉంటుందనేది ప్రభుత్వ పెద్దల భావనగా ఉందట… దీంతో పాటు.. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలు.. నదీ జలాల వాటాల గొడవలు.. డిస్కంలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గొడవ వంటివి కూడా సీఎంల భేటీలో ప్రస్తావనకు తెచ్చేలా ఏపీ ప్రభుత్వం సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది.
Read Also: Delhi: నేను తీవ్రవాదిని కాదు.. బెయిల్ ఇవ్వండి: కేజ్రీవాల్
మరోవైపు, ఇప్పటికీ కొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అక్కడి వారు ఇక్కడ.. ఇక్కడి వారు అక్కడ అనే రీతిలో పని చేస్తున్నారు. ఏపీకి అలాట్ చేసిన వారు కూడా తెలంగాణలో పని చేస్తున్న పరిస్థితి. అలాంటి వారి విషయంలో ఏం చేయాలనే దానిపై క్లారిటీకి రావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఏపీ నుంచి తమను రిలీవ్ చేయాలని తెలంగాణ ఉద్యోగుల కోరుతున్నారు. ప్రస్తుతం ఏపీలో 712 మంది స్థానికత ఉన్న ఉద్యోగులు పని చేస్తున్నారు. సచివాలయం, హెచ్వోడీలు, 9, 10వ షెడ్యూల్ సంస్థల్లో పని చేస్తున్న 224 మంది రాష్ట్ర కేడర్ ఉద్యోగులను కూడా రిలీవ్ చేయాలని కోరుతోన్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. సీనియార్టీ కొల్పోయినా ఫర్వాలేదని.. తమను తమ రాష్ట్రానికి పంపాలని తెలంగాణ ఉద్యోగులు అంటున్నారు. విభజన జరిగి పదేళ్లైనా స్థానికత ఆధారంగా తమను స్వరాష్ట్రానికి పంపకపోవడంపై తెలంగాణ ఉద్యోగుల ఆవేదన చెందుతున్నారు. తమ విజ్ఞప్తులను పరిష్కరించాలని రెండు రాష్ట్రాల సీఎంలను అభ్యర్థిస్తున్నారు ఏపీలోని తెలంగాణ ఉద్యోగులు. ఈ విషయం మీద సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక అన్నింటికంటే ముఖ్యం.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతి అంశంలోనూ గొడవలు పడుతూ ఉంటే.. కేంద్రం జోక్యం అనివార్యమవుతుంది. దీంతో పరిస్థితి మరింత జఠిలం కావడం తప్ప.. సమస్య సులువుగా పరిష్కారం కాదనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన. దీంతో ముందుగా ఈజీగా సాల్వ్ అయ్యే పరిష్కారాలేంటో చూసుకుని.. వీలైనంత త్వరగా మెజార్టీ సమస్యలను పరిష్కరించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుందట.. అయితే, ఈ భేటీలో రెండు రాష్ట్రాల సీఎంలతో పాటు.. ఇంకా ఎవరెవరు పాల్గొంటారు.. అజెండా ఏంటి అనేదానిపై మాత్రం మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!