CM Revanth Reddy: తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం..
- తెలంగాణలో పెట్టుబడులకు ఆహ్వానించాం..
- దావోస్ నుండి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం..
- మహిళలను కోటీశ్వరులను చేయడమే మా అజెండాగా పెట్టుకున్నాం..
- ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం: సీఎం రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సమ్మిట్ లో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉంది.. తెలంగాణకు ఎంతో ఘన చరిత్ర ఉందన్నారు.. అయితే, గత పదేళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు.. అందుకే కాంగ్రెస్ పాలన మీద ప్రజలు ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నారని తెలిపారు. ఇక, రూ. 20 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేశాం.. దేశంలోనే ఇది పెద్ద నిర్ణయం.. రైతు భరోసా పేరుతో రూ. 12000 ఎకరాకు ఇస్తున్నాం.. ఉపాధి హామీ కార్డు దారులకు సాయం చేస్తున్నాం.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమాజంలోని ప్రతి ఒక్కరి ఆకాంక్షలు నెరవేర్చడమే మా ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. భారత దేశ చరిత్రలోనే అతి పెద్ద సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నాం.. రూ. 20,617 కోట్లతో రుణమాఫీ చేశాం.. 24/7 ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.. లక్షల మంది రైతులను రుణ విముక్తుల్ని చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Read Also: MIB: ‘‘రక్షణ కార్యకలాపాల కవరేజ్ని ఆపేయండి’’.. మీడియాకు కేంద్రం కీలక ఆదేశాలు..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
అలాగే, రైతులు మద్దతు ధర కోసం గతంలో ఆందోళనలు చేసేవారు అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. కానీ, మేం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్దతు ధరతో పాటు ధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తున్నాం.. ఇక, ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో విద్యార్థులది కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. కానీ, వారికి ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. తొలి ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశాం.. 5 లక్షల యువతకు రాజీవ్ యువ వికాసం అమలు చేస్తున్నాం.. ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకుని దాని ప్రకారం ముందుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ విధానం అని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Read Also: Harsha Kumar: ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు.. ఘటనా స్థలంలో బహిరంగసభ..
తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాం.. దావోస్ నుంచి లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చాం.. మహిళలను కోటీశ్వరులను చేయడమే మా అజెండాగా పెట్టుకున్నాం.. మహిళా పారిశ్రామిక వేత్తలను బడా పారిశ్రామిక వేత్తలుగా చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం..ఆర్టీసీలో మహిళలు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నాం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ 10 లక్షల వరకు పరిధి పెంచాం.. ఏడాదిలో రూ. 1000 కోట్లు ఖర్చు చేశాం.. మూసి నదిని పునరుజ్జీవం చేసేందుకు కృషి చేస్తున్నాం.. మూసి పెద్ద ఎట్రాక్షన్ కాబోతుంది అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!