Harassment: కాలం ఎటుపోతుంది.. రెండో తరగతి చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అసభ్య ప్రవర్తన..
- ఉప్పల్ ప్రముఖ స్కూల్ లో చిన్నారిపై లైంగిక వేధింపులు..
- రెండో తరగతి చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించిన 9 తరగతి విద్యార్థి..
- చిన్నారితో వికృతి చేష్టలకు పాల్పడ్డ విద్యార్థి..
- పాఠశాలకు చేరుకున్న చిన్నారి తల్లిదండ్రులు..
Harassment: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వాడకం అనివార్యంగా మారింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఉంటోంది. స్మార్ట్ ఫోన్ లేకుంటే రోజు గడవని పరిస్థితి నెలకొంది. అలా సెల్ ఫోన్ శరీరంలో ఓ భాగమైపోయింది. కోవిడ్ తర్వాత సెల్ ఫోన్ చిన్నారులకు కూడా అత్యవసర వస్తువుగా మారింది. సెల్ఫోన్తో చిన్నారులకు కొంత మంచి జరిగితే.. మరికొందరికి అనేక దుష్ప్రభావాలను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో పిల్లలపై స్మార్ట్ఫోన్లు ప్రతికూల ప్రభావాలు చూపుతాయి. మొబైల్ ఫోనే అన్ని ప్రమాదాలకు కారణం అవుతుంది. వాటిలో కొన్ని అసభ్యకర వీడియోల కారణంగానే ఇలా జరుగుతోంది. పిల్లల చేతిలో మొబైల్ ఫోన్లు ఉండడంతో కొన్ని వీడియోలు వారిపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఆ వీడియోలు చిన్నప్పటి నుంచి ప్రభావితం చేస్తూ యువతను నాశనం చేస్తున్నాయి. దీనివల్ల కొందరు చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటన హైదరాబాద్ ఉప్పల్ లోని ఓ ప్రముఖ స్కూల్ లో సంచలనంగా మారింది.
Read also: West Bengal : 14 గంటల విచారణ… ఆపై అరెస్ట్, రేషన్ పంపిణీ కుంభకోణంలో టీఎంసీ నేతపై ఈడీ యాక్షన్
Also Read
చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉప్పల్ ప్రముఖ స్కూల్ లో కలకలం రేపింది. రెండో తరగతి చిన్నారిపై 9 తరగతి విద్యార్థి అసభ్యంగా ప్రవర్తించాడు. చిన్నారితో వికృతి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో చిన్నారి తమ తల్లిదండ్రలతో విషయం చెప్పడంతో చిన్నారి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. స్కూల్ యాజమాన్యం స్పందించాలని ధర్నా చేశారు. చిన్నారిపై లైంగిక వేధింపులు ఏంటని? ఆగ్రహం వ్యక్తం చేశారు. మేనేజ్మెంట్ వెంటనే స్పందిచకపోతే పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. దీంతో స్కూల్ మేనేజ్మెంట్ స్పందించి 9వ తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించారు. స్కూల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. పిల్లలకు సెల్ ఫోన్ లు చేతిలో ఇవ్వకూడదని అన్నారు. విద్యా భుద్దులు నేర్పకుండా తల్లిదండ్రుల పనులకు ఆటంకం చేస్తున్నారంటూ.. వారికి సెల్ ఫోన్ ఇచ్చి పక్కన కూర్చొబెట్టడం అందరికి అలవాటు మారిందన్నారు. ఇప్పటికైనా పిల్లలకు సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలని సూచించారు.
CM Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ.. ఎంతో సంతృప్తిని ఇచ్చింది..
తాజావార్తలు
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
-
Ashu Reddy: మోసం కేసులో ట్విస్ట్.. మౌనం వీడిన అషు రెడ్డి
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!