West Bengal : 14 గంటల విచారణ… ఆపై అరెస్ట్, రేషన్ పంపిణీ కుంభకోణంలో టీఎంసీ నేతపై ఈడీ యాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో టీఎంసీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు తీసుకుంది. 14 గంటల విచారణ అనంతరం ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ నేతలను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. టీఎంసీకి చెందిన దేగంగా బ్లాక్ ప్రెసిడెంట్ అనీస్ ఉర్ రెహ్మాన్, అతని అన్నయ్యను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు, దర్యాప్తు సంస్థ కోల్కతా కార్యాలయంలో దాదాపు 14 గంటల పాటు విచారించింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి రెహ్మాన్, అతని సోదరుడిని అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం అతడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మాజీ మంత్రి జ్యోతిప్రియ మాలిక్కు రెహ్మాన్ అత్యంత సన్నిహితుడు. ఈ కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే మాజీ మంత్రిని అరెస్టు చేసింది.
Read Also:VD 12: వామ్మో.. దేవరకొండ ఇలా ఉన్నాడేంటి?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
మాజీ మంత్రికి సన్నిహితుడైన మరో వ్యక్తికి సమన్లు
రైస్మిల్లు యజమాని, మాజీ మంత్రికి చెందిన మరో సన్నిహితుడు బారిక్ బిస్వాస్కు శుక్రవారం విచారణ నిమిత్తం కార్యాలయంలో హాజరుకావాలని ఇడి అధికారులు సమన్లుజారీ చేసినట్లు అధికారి తెలిపారు. మంగళవారం విశ్వాస్ నివాసం, రైస్మిల్లుపై ఈడీ దాడులు నిర్వహించగా రూ.40 లక్షలకు పైగా నగదు, యూఏఈలోని ఆస్తుల్లో పెట్టుబడులకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Read Also:CM Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ.. ఎంతో సంతృప్తిని ఇచ్చింది..
షాజహాన్ షేక్ కూడా అరెస్టు
రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో టీఎంసీ నేత షాజహాన్ షేక్ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారించేందుకు ఈడీ బృందం షాజహాన్ షేక్ ఇంటికి చేరుకుని దాడులు చేసింది. బృందం అక్కడికి చేరుకోగా, షాజహాన్ కనిపించలేదు, కానీ కేంద్ర అధికారులు ఆ ఇంటి ముందు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈడీ బృందంపై షాజహాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!