West Bengal : 14 గంటల విచారణ… ఆపై అరెస్ట్, రేషన్ పంపిణీ కుంభకోణంలో టీఎంసీ నేతపై ఈడీ యాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో టీఎంసీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు తీసుకుంది. 14 గంటల విచారణ అనంతరం ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ నేతలను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. టీఎంసీకి చెందిన దేగంగా బ్లాక్ ప్రెసిడెంట్ అనీస్ ఉర్ రెహ్మాన్, అతని అన్నయ్యను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు, దర్యాప్తు సంస్థ కోల్కతా కార్యాలయంలో దాదాపు 14 గంటల పాటు విచారించింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి రెహ్మాన్, అతని సోదరుడిని అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం అతడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మాజీ మంత్రి జ్యోతిప్రియ మాలిక్కు రెహ్మాన్ అత్యంత సన్నిహితుడు. ఈ కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే మాజీ మంత్రిని అరెస్టు చేసింది.
Read Also:VD 12: వామ్మో.. దేవరకొండ ఇలా ఉన్నాడేంటి?
Also Read
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
మాజీ మంత్రికి సన్నిహితుడైన మరో వ్యక్తికి సమన్లు
రైస్మిల్లు యజమాని, మాజీ మంత్రికి చెందిన మరో సన్నిహితుడు బారిక్ బిస్వాస్కు శుక్రవారం విచారణ నిమిత్తం కార్యాలయంలో హాజరుకావాలని ఇడి అధికారులు సమన్లుజారీ చేసినట్లు అధికారి తెలిపారు. మంగళవారం విశ్వాస్ నివాసం, రైస్మిల్లుపై ఈడీ దాడులు నిర్వహించగా రూ.40 లక్షలకు పైగా నగదు, యూఏఈలోని ఆస్తుల్లో పెట్టుబడులకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Read Also:CM Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ.. ఎంతో సంతృప్తిని ఇచ్చింది..
షాజహాన్ షేక్ కూడా అరెస్టు
రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో టీఎంసీ నేత షాజహాన్ షేక్ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారించేందుకు ఈడీ బృందం షాజహాన్ షేక్ ఇంటికి చేరుకుని దాడులు చేసింది. బృందం అక్కడికి చేరుకోగా, షాజహాన్ కనిపించలేదు, కానీ కేంద్ర అధికారులు ఆ ఇంటి ముందు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈడీ బృందంపై షాజహాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు.
తాజావార్తలు
-
Tejaswini Nandamuri : బాలయ్య కూతురిని డైరెక్ట్ చేయబోయే దర్శకురాలు ఎవరంటే?
-
Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!