West Bengal : 14 గంటల విచారణ… ఆపై అరెస్ట్, రేషన్ పంపిణీ కుంభకోణంలో టీఎంసీ నేతపై ఈడీ యాక్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Bengal : రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో టీఎంసీ నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు తీసుకుంది. 14 గంటల విచారణ అనంతరం ఇద్దరు తృణమూల్ కాంగ్రెస్ నేతలను దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. టీఎంసీకి చెందిన దేగంగా బ్లాక్ ప్రెసిడెంట్ అనీస్ ఉర్ రెహ్మాన్, అతని అన్నయ్యను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు, దర్యాప్తు సంస్థ కోల్కతా కార్యాలయంలో దాదాపు 14 గంటల పాటు విచారించింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి రెహ్మాన్, అతని సోదరుడిని అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం అతడిని కోర్టులో హాజరు పరుస్తామన్నారు. రాష్ట్ర అటవీ శాఖ మాజీ మంత్రి జ్యోతిప్రియ మాలిక్కు రెహ్మాన్ అత్యంత సన్నిహితుడు. ఈ కుంభకోణానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఇప్పటికే మాజీ మంత్రిని అరెస్టు చేసింది.
Read Also:VD 12: వామ్మో.. దేవరకొండ ఇలా ఉన్నాడేంటి?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
మాజీ మంత్రికి సన్నిహితుడైన మరో వ్యక్తికి సమన్లు
రైస్మిల్లు యజమాని, మాజీ మంత్రికి చెందిన మరో సన్నిహితుడు బారిక్ బిస్వాస్కు శుక్రవారం విచారణ నిమిత్తం కార్యాలయంలో హాజరుకావాలని ఇడి అధికారులు సమన్లుజారీ చేసినట్లు అధికారి తెలిపారు. మంగళవారం విశ్వాస్ నివాసం, రైస్మిల్లుపై ఈడీ దాడులు నిర్వహించగా రూ.40 లక్షలకు పైగా నగదు, యూఏఈలోని ఆస్తుల్లో పెట్టుబడులకు సంబంధించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Read Also:CM Chandrababu: ఒక్కరోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ.. ఎంతో సంతృప్తిని ఇచ్చింది..
షాజహాన్ షేక్ కూడా అరెస్టు
రేషన్ పంపిణీ కుంభకోణం కేసులో టీఎంసీ నేత షాజహాన్ షేక్ను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసును విచారించేందుకు ఈడీ బృందం షాజహాన్ షేక్ ఇంటికి చేరుకుని దాడులు చేసింది. బృందం అక్కడికి చేరుకోగా, షాజహాన్ కనిపించలేదు, కానీ కేంద్ర అధికారులు ఆ ఇంటి ముందు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈడీ బృందంపై షాజహాన్ మద్దతుదారులు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రిలో చేర్చారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..