Suicide : అత్తింటివారి వేధింపులు తాళలేక దుర్గంచెరువుపై నుంచి దూకి ఆత్మహత్య
- ఆఫీసుకెళ్తున్నానని చెప్పి వెళ్లిన సుష్మ
- దుర్గం చెరువులో మృతదేహంగా
- పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య.. అదనపు కట్న వేధింపులే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బాధితురాలిని సుష్మ (27)గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుఝామున 4 గంటలకు బొట్టు అంజయ్య అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్ను మాదాపూర్ పోలీసులకు ఇచ్చారు. “ఆఫీస్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సుష్మ తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఉదయం 7 గంటలకు దుర్గం చెరువు వద్ద ఒక మృతదేహం కనిపించిందని సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అది మిస్సింగ్ అయిన సుష్మదిగా గుర్తించారు.
Shocking Incident: బెంగళూరు అపార్ట్మెంట్లో భారీగా అస్థి పంజరాలు లభ్యం!
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Devji : లాసెట్లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ..
సుష్మ ఈ ఏడాది జనవరి 31న అమృత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహం చేసుకుంది. అమృత్ కూడా ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సుష్మ తల్లిదండ్రుల ప్రకారం.. పెళ్లి సమయంలో 6 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు, బైక్ను కట్నంగా ఇచ్చారు. అయినప్పటికీ సుష్మ అత్త, మామలు అదనపు కట్నం కోసం వేధించారని, ఇటీవల ఆమె శారీరకంగా, మానసికంగా తీవ్రంగా బాధపడుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కొద్దీ రోజులుగా ఆరోగ్యం బాగాలేదని, నేరెడ్మేట్లోని ఓ హాస్పిటల్లో సుష్మను రెండు రోజుల క్రితం వైద్యులకు చూపించినట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. అయితే.. నిన్న ఆమె తిరిగి ఆఫీస్కు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ తిరిగి రాలేదని వారు తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, సుష్మ తన అత్తింటి వారు, భర్త నుంచి ఎదుర్కొంటున్న అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానిస్తున్నారు. మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్ మీడియాతో మాట్లాడుతూ, “కేసు నమోదు చేశాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. విచారణ కొనసాగుతోంది” అని తెలిపారు.
YS Jagan: 9వ తరగతి బాలికకు న్యాయం చేసే దమ్ము చంద్రబాబుకు లేదా?
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!