Suicide : అత్తింటివారి వేధింపులు తాళలేక దుర్గంచెరువుపై నుంచి దూకి ఆత్మహత్య
- ఆఫీసుకెళ్తున్నానని చెప్పి వెళ్లిన సుష్మ
- దుర్గం చెరువులో మృతదేహంగా
- పెళ్లైన నాలుగు నెలలకే ఆత్మహత్య.. అదనపు కట్న వేధింపులే కారణమా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బాధితురాలిని సుష్మ (27)గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుఝామున 4 గంటలకు బొట్టు అంజయ్య అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్ను మాదాపూర్ పోలీసులకు ఇచ్చారు. “ఆఫీస్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సుష్మ తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఉదయం 7 గంటలకు దుర్గం చెరువు వద్ద ఒక మృతదేహం కనిపించిందని సమాచారం అందింది. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. అది మిస్సింగ్ అయిన సుష్మదిగా గుర్తించారు.
Shocking Incident: బెంగళూరు అపార్ట్మెంట్లో భారీగా అస్థి పంజరాలు లభ్యం!
Also Read
- Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
- DSP transfers : తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ.!
- Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. రేపు రైతుల ఖాతాల్లోకి 'రైతు భరోసా' నిధులు!
- HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
సుష్మ ఈ ఏడాది జనవరి 31న అమృత్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహం చేసుకుంది. అమృత్ కూడా ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సుష్మ తల్లిదండ్రుల ప్రకారం.. పెళ్లి సమయంలో 6 తులాల బంగారం, రూ.5 లక్షల నగదు, బైక్ను కట్నంగా ఇచ్చారు. అయినప్పటికీ సుష్మ అత్త, మామలు అదనపు కట్నం కోసం వేధించారని, ఇటీవల ఆమె శారీరకంగా, మానసికంగా తీవ్రంగా బాధపడుతోందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కొద్దీ రోజులుగా ఆరోగ్యం బాగాలేదని, నేరెడ్మేట్లోని ఓ హాస్పిటల్లో సుష్మను రెండు రోజుల క్రితం వైద్యులకు చూపించినట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. అయితే.. నిన్న ఆమె తిరిగి ఆఫీస్కు వెళ్తున్నానంటూ ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ తిరిగి రాలేదని వారు తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, సుష్మ తన అత్తింటి వారు, భర్త నుంచి ఎదుర్కొంటున్న అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని అనుమానిస్తున్నారు. మాదాపూర్ సీఐ కృష్ణ మోహన్ మీడియాతో మాట్లాడుతూ, “కేసు నమోదు చేశాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. విచారణ కొనసాగుతోంది” అని తెలిపారు.
YS Jagan: 9వ తరగతి బాలికకు న్యాయం చేసే దమ్ము చంద్రబాబుకు లేదా?
తాజావార్తలు
-
Minister Seethakka : కేంద్రానికి తెలంగాణ కౌంటర్.. సీతక్క వినతిలో కీలక డిమాండ్లు.!
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Market Crash: స్విగ్గీ, జొమాటోలకు రూ.1.41 లక్షల కోట్ల భారీ లాస్.. ఏం జరిగిందంటే?
-
Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
-
Tollywood: 2026 సెకండాఫ్ సినిమాలపైనే ఆశలు!
ట్రెండింగ్
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!