Tragedy: హైదరాబాద్లో భారీ వర్షానికి ఇద్దరు బలి..
- కుండపోత వర్షంతో జలమయమైన చాంద్రాయణగుట్ట ప్రాంతం
- రోడ్డుపై తెగిపడ్డ విద్యుత్ తీగలు.. గుర్తించలేక ప్రమాదం
- ఒకరిని కాపాడబోయి మరొకరు.. ఇద్దరూ అక్కడికక్కడే మృతి
- భారీ వర్షాల వేళ అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: భాగ్యనగరంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. నగరవ్యాప్తంగా కుండపోతగా వాన పడటంతో పలు ప్రాంతాలు జలమయమవగా, పాతబస్తీలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
మంగళవారం కురిసిన కుంభవృష్టికి చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో వర్షం దాటికి రోడ్డుపై కరెంట్ తీగలు తెగిపడ్డాయి. అయితే, నీరు నిలిచి ఉండటంతో ఆ ప్రమాదాన్ని గమనించని బాధితులు ప్రయాణిస్తున్న ఆటోను పక్కకు నిలిపారు. అనంతరం వారు ఆటోలో నుంచి కిందకు దిగే క్రమంలో రోడ్డుపై పడి ఉన్న సజీవ విద్యుత్ తీగలను తాకారు. దీంతో ఒకరిని కాపాడబోయి మరొకరు.. ఇద్దరూ తీవ్రమైన కరెంట్ షాక్కు గురై స్పాట్లోనే ప్రాణాలు విడిచారు.
Also Read
- Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్రెడ్డి లేఖ
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ సరఫరాను నిలిపివేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో చాంద్రాయణగుట్ట ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, వాహనదారులు రోడ్లపై నడిచేటప్పుడు, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, వైర్ల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!