New Kind of Fraud: కొత్త తరహా మోసం.. దొంగతనం చేస్తారు ఓఎల్ఎక్స్లో అమ్ముతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Kind of Fraud: ఇప్పటికే మార్కెట్ లో రకరకాల దొంగలు తమ చేతివాటం చూపి ప్రజలను దోచుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఎంత మంది బలి అయినా.. కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా అన్నట్లు కొత్త దొంగలు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. మార్కెట్లోకి కొందరు విచిత్ర దొంగలు వచ్చారు. కొత్త తరహా దొంగతనాలతో రైతులు టెన్షన్ పడుతున్నారు. కానీ.. వాళ్లు దోచుకునేది ద్విచక్ర వాహనాలు, నగదు, బంగారం కాదండోయ్.. ట్రాక్టర్లకు ఉండే ట్రాలీలు కొట్టేస్తున్నారు. పొలాల దగ్గర పార్క్ చేసిన ట్రాలీలు ఉంటే చాలు రాత్రికి రాత్రే చూసి.. రాత్రికి రాత్రే వాటిని దోచేయడయే కాకుండా.. దానిని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేయడం.ఇది ఎక్కడో కాదండోయ్.. మన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.
ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న సంపంగి మహేశ్, ఉర్సు వెంకన్నలు ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీని కోసం కొట్టేసేందుకు ఈజీగా ఉన్న ట్రాక్టర్ ట్రాలీలను ఎంచుకున్నాడు. ఇక ట్రాలీలైతే.. ఊరికి దూరంగా పొలాలు, బావుల దగ్గర పార్క్ చేస్తారు కాబట్టి.. సులువుగా కొట్టేయొచ్చని ప్లాన్ వేశాడు. ఇదే విషయం వెంకన్నకు చెప్పగా తను కూడా ఒప్పుకున్నాడు. ఇంకేముంది.. ఇద్దరూ కలిసి రంగంలోకి దిగారు.. బావులు, పొలాల దగ్గర ట్రాక్టర్ ట్రాలీలు కనిపిస్తే రాత్రి వేళల్లో ఇంజన్ల సాయంతో వాటిని దొంగతనం చేయడం ప్రారంభిస్తారు. అయితే.. నేరుగా విక్రయిస్తే.. ఎవరికైనా అనుమానం వస్తుందని భావించి సెకండ్ హ్యాండ్ కింద.. ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్లో విక్రయించి.. సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు.
Also Read
- GHMC: 70 ఏళ్ల నాటి జీహెచ్ఎంసీ చట్టానికి గుడ్బై.. సరికొత్త ముసాయిదా బిల్లు..
- Heavy Rain Alert: తెలంగాణకు వాన ముప్పు.. ఈ 4 రోజులు జాగ్రత్త..
- TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!
- Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
అయితే.. గతేడాది అక్టోబర్లో మొదలైన ఈ చోరీలు.. ఎవరికీ దొరకకుండా చక్కగా నడిపించారు. అయితే.. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలంలో డిసెంబర్ 31న గ్రామం చివరన ట్రాక్టర్ ట్రాలీ చోరీకి గురైంది. ట్రాలీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 20 లక్షల విలువైన 13 ట్రాక్టర్ ట్రాలీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ వీరు చేసిన చోరీల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10, నల్గొండలో ఒకటి, నాగర్ కర్నూల్ లో ఒకటి కేసులు నమోదయ్యాయి.
Pakistan : బలూచిస్థాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం
తాజావార్తలు
-
Trump – Putin: ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్? ట్రంప్కు పుతిన్ అర్ధరాత్రి ఫోన్.. 90 నిమిషాల పాటు ఏం మాట్లాడుకున్నారంటే!
-
Kajal Aggarwal: ‘రామాయణం’లో నా పాత్ర చిన్నదే.. అయినా అది జీవితాంతం గుర్తుండిపోతుంది!
-
Meta India notice: ఇన్స్టాగ్రామ్పై కేంద్రం సీరియస్.. బాలల లైంగిక దోపిడీ కంటెంట్ తొలగించాలని మెటాకు నోటీసులు
-
Babar Azam: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ జట్టు.. కెప్టెన్గా బాబర్ రీఎంట్రీ..
-
Medical Mafia: రూ.35 మెడిసిన్ను రూ.85,000కు అమ్ముతున్నారు.. అడ్డంగా దోచుకుంటున్న అమెరికా!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!