New Kind of Fraud: కొత్త తరహా మోసం.. దొంగతనం చేస్తారు ఓఎల్ఎక్స్లో అమ్ముతారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Kind of Fraud: ఇప్పటికే మార్కెట్ లో రకరకాల దొంగలు తమ చేతివాటం చూపి ప్రజలను దోచుకుంటున్నారు. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. ఎంత మంది బలి అయినా.. కొత్త సంవత్సరంలో కొత్త కొత్తగా అన్నట్లు కొత్త దొంగలు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో.. మార్కెట్లోకి కొందరు విచిత్ర దొంగలు వచ్చారు. కొత్త తరహా దొంగతనాలతో రైతులు టెన్షన్ పడుతున్నారు. కానీ.. వాళ్లు దోచుకునేది ద్విచక్ర వాహనాలు, నగదు, బంగారం కాదండోయ్.. ట్రాక్టర్లకు ఉండే ట్రాలీలు కొట్టేస్తున్నారు. పొలాల దగ్గర పార్క్ చేసిన ట్రాలీలు ఉంటే చాలు రాత్రికి రాత్రే చూసి.. రాత్రికి రాత్రే వాటిని దోచేయడయే కాకుండా.. దానిని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేయడం.ఇది ఎక్కడో కాదండోయ్.. మన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.
ట్రాక్టర్ ట్రాలీలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న సంపంగి మహేశ్, ఉర్సు వెంకన్నలు ఆదాయం లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీని కోసం కొట్టేసేందుకు ఈజీగా ఉన్న ట్రాక్టర్ ట్రాలీలను ఎంచుకున్నాడు. ఇక ట్రాలీలైతే.. ఊరికి దూరంగా పొలాలు, బావుల దగ్గర పార్క్ చేస్తారు కాబట్టి.. సులువుగా కొట్టేయొచ్చని ప్లాన్ వేశాడు. ఇదే విషయం వెంకన్నకు చెప్పగా తను కూడా ఒప్పుకున్నాడు. ఇంకేముంది.. ఇద్దరూ కలిసి రంగంలోకి దిగారు.. బావులు, పొలాల దగ్గర ట్రాక్టర్ ట్రాలీలు కనిపిస్తే రాత్రి వేళల్లో ఇంజన్ల సాయంతో వాటిని దొంగతనం చేయడం ప్రారంభిస్తారు. అయితే.. నేరుగా విక్రయిస్తే.. ఎవరికైనా అనుమానం వస్తుందని భావించి సెకండ్ హ్యాండ్ కింద.. ఓఎల్ఎక్స్ ప్లాట్ఫామ్లో విక్రయించి.. సొమ్ము చేసుకోవడం మొదలుపెట్టారు.
Also Read
- OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
- Cabinet Sub Committee : రేపు కేబినెట్ సబ్ కమిటీ అత్యవసర భేటీ!
- Off The Record : డెలివరీ సూపర్.. ప్రచారం వీక్! కాంగ్రెస్ మార్క్ పాలన ప్రజల్లోకి వెళ్లడం లేదా?
- Off The Record : సొంత ప్రభుత్వమైనా తగ్గేదే లే.. దొంతి మాధవరెడ్డి రూటే సెపరేటు!
అయితే.. గతేడాది అక్టోబర్లో మొదలైన ఈ చోరీలు.. ఎవరికీ దొరకకుండా చక్కగా నడిపించారు. అయితే.. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండలంలో డిసెంబర్ 31న గ్రామం చివరన ట్రాక్టర్ ట్రాలీ చోరీకి గురైంది. ట్రాలీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగలను పట్టుకున్నారు. నిందితుల నుంచి సుమారు 20 లక్షల విలువైన 13 ట్రాక్టర్ ట్రాలీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ వీరు చేసిన చోరీల్లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 10, నల్గొండలో ఒకటి, నాగర్ కర్నూల్ లో ఒకటి కేసులు నమోదయ్యాయి.
Pakistan : బలూచిస్థాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం
తాజావార్తలు
-
Bengal: 15 ఏళ్లు ఆలస్యమైన ప్రాజెక్ట్ 15 రోజుల్లో పూర్తి
-
Digital Arrest Scam: దేశంలోనే బిగ్గెస్ట్ డిజిటల్ అరెస్ట్.. వృద్ధురాలి నుంచి ఏకంగా రూ.24 కోట్లు నొక్కేసిన కేటుగాళ్లు!
-
HYD RACING NEWSENSE: రేసింగ్లకు పాల్పడే పోకిరీలు మరింత రెచ్చిపోయారు..! ఏకంగా పోలీసుల మీదకే కార్లతో దూసుకొచ్చి హంగామా
-
OTR : పవన్ కల్యాణ్ క్లాస్ రూమ్.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?