Pakistan : బలూచిస్థాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు పాక్ సైనికులు మరణించారు. ఆ తర్వాత పాక్ సైన్యం ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. పాక్ ఆర్మీ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఈ విషయాన్ని వెల్లడించింది. కెచ్ జిల్లాలోని బులెడా ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారని ISPR తెలిపింది. అనంతరం ఎదురుకాల్పులకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Also:IND vs AFG: అఫ్గానిస్థాన్తో రెండో టీ20.. సిరీస్పై కన్నేసిన భారత్! కళ్లన్నీ కోహ్లీపైనే
Also Read
ఈ దాడిలో మరణించిన సైనికులను కానిస్టేబుల్ టిప్పు రజాక్ (23), కానిస్టేబుల్ సన్నీ షౌకత్ (24), కానిస్టేబుల్ షఫీ ఉల్లా (23), లాన్స్ నాయక్ తారిఖ్ అలీ (25), కానిస్టేబుల్ ముహమ్మద్ తారిఖ్ ఖాన్ (25)గా గుర్తించారు. రజాక్ సాహివాల్ నివాసి.. సన్నీ షౌకత్ కరాచీ నివాసితులు, షఫీ ఉల్లా లాస్బెలా, తారిఖ్ అలీ ఒరాక్జాయ్, తారిఖ్ ఖాన్ మియాన్వాలి.
Read Also:Minister Roja: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తరిమేయండి.. వాళ్లు నాన్ లోకల్
ఇటీవలి నెలల్లో పాకిస్తాన్లో, ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం, అంటే గత బుధవారం, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు మరణించారు. 2023లో పాకిస్థాన్లో 789 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇందులో 1524 మంది మరణించగా, 1463 మంది గాయపడ్డారు. ఆరేళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులలో అత్యధిక మరణాలు సంభవించాయి.
తాజావార్తలు
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..