Pakistan : బలూచిస్థాన్లో ఎన్కౌంటర్.. ఐదుగురు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో సైన్యం, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు పాక్ సైనికులు మరణించారు. ఆ తర్వాత పాక్ సైన్యం ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. పాక్ ఆర్మీ మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ఈ విషయాన్ని వెల్లడించింది. కెచ్ జిల్లాలోని బులెడా ప్రాంతంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల వాహనాన్ని ఐఈడీతో పేల్చివేశారని ISPR తెలిపింది. అనంతరం ఎదురుకాల్పులకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Read Also:IND vs AFG: అఫ్గానిస్థాన్తో రెండో టీ20.. సిరీస్పై కన్నేసిన భారత్! కళ్లన్నీ కోహ్లీపైనే
Also Read
- Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
- ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
- CM Chandrababu: ‘సంజీవని’కి శ్రీకారం.. గిరిజనులకు సీఎం చంద్రబాబు గుడ్న్యూస్
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వైభవ్ బౌలింగ్కు అంతా ఫిదా.. ఇషాన్ కిషన్కు తెలియని సీక్రెట్ ఇదే..!
ఈ దాడిలో మరణించిన సైనికులను కానిస్టేబుల్ టిప్పు రజాక్ (23), కానిస్టేబుల్ సన్నీ షౌకత్ (24), కానిస్టేబుల్ షఫీ ఉల్లా (23), లాన్స్ నాయక్ తారిఖ్ అలీ (25), కానిస్టేబుల్ ముహమ్మద్ తారిఖ్ ఖాన్ (25)గా గుర్తించారు. రజాక్ సాహివాల్ నివాసి.. సన్నీ షౌకత్ కరాచీ నివాసితులు, షఫీ ఉల్లా లాస్బెలా, తారిఖ్ అలీ ఒరాక్జాయ్, తారిఖ్ ఖాన్ మియాన్వాలి.
Read Also:Minister Roja: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను తరిమేయండి.. వాళ్లు నాన్ లోకల్
ఇటీవలి నెలల్లో పాకిస్తాన్లో, ముఖ్యంగా ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం, అంటే గత బుధవారం, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఇద్దరు సైనికులు మరణించారు. 2023లో పాకిస్థాన్లో 789 ఉగ్రవాద దాడులు జరిగాయి. ఇందులో 1524 మంది మరణించగా, 1463 మంది గాయపడ్డారు. ఆరేళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులలో అత్యధిక మరణాలు సంభవించాయి.
తాజావార్తలు
-
Ravi Teja: ఇరుముడి జోష్లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
-
Ananthika Sanilkumar: ‘ఎల్లమ్మ’లో హీరోయిన్ ఫిక్స్.. డీఎస్పీకి జోడీ ఎవరో తెలుసా?
-
Cricket Record: 47 ఏళ్లకు అరంగేట్రం.. 51 ఏళ్ల వయసులో ప్రపంచ రికార్డు.. క్రికెట్లో 96 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Kangana Ranaut: కంగనా, రామ్దేవ్ వివాదానికి రాఖీతో ముగింపు.. మిఠాయిలతో మళ్లీ అన్నాచెల్లెళ్ల బంధం!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
ట్రెండింగ్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!