Atrocious: భార్య బతికి వుండగానే చనిపోయిందని మరో పెళ్లి.. కూతుర్ని కడుపులోనే చంపిన కసాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious: మహిళ సామాన్యంగా గర్భవతి అయిందంటే చాలు కడుపులో ఉంది మగ బిడ్డా లేక ఆడబిడ్డ అని తెలుసుకోవాలని ఆత్రంగా ఉంటారు. అయితే.. మనదేశంలో లింగ నిర్ధారణ పరీక్ష నిషేధం. కానీ.. కొందరు అడ్డదారిలో కడుపులో ఉంది ఆడబిడ్డ.. మగ బిడ్డ తెలుసుకొని పొరపాటున జన్మించబోయేది ఆడబిడ్డని తెలిస్తే వెంటనే అబార్షన్ చేయించిన సందర్భాలున్నాయి. అయితే.. అలా తెలుసుకోలేని వారు జన్మించిన అనంతరం మగ బిడ్డ అయితే ఉంచుకొని ఆడబిడ్డ అయితే చెత్త కుప్పల్లో.. పొదల్లో పడేసి పోతుంటారు కొంతమంది దౌర్భాగ్యులు. ఇటువంటి సమాజంలో ఉంటున్నాం మనం.. అయితే ఓ ప్రబుద్దుడు చేసిన ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోయింది. ఆడపిల్లలు పుడుతున్నారని తన భార్యకు నాలుగు సార్లు అబర్షన్ చేయించడమే కాకుండా.. తన భార్య చనిపోయిందని రెండో పెళ్లి చేసుకున్న ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
Read also: Niti Aayog : బంజరు ప్రాంతాలలో పచ్చదనం… ఇస్రో, నీతి ఆయోగ్ సంయుక్త ప్రణాళిక
Also Read
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
- Sangareddy: భార్య సంపాదన పుట్టింటికి ఇస్తోందని కసి.. సుపారీ ఇచ్చి హత్య చేయించిన భర్త!
- DGP CV Anand: "ఇకపై నో ఫ్రెండ్లీ పోలీసింగ్".. వాళ్లను అస్సలు వదలమన్న డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్లో నిత్య పెళ్లి కొడుకుల ఆగడాలు వెలుగు చూశాయి. బతికుండగానే భార్య చనిపోవడంతో అమరేందర్ అనే వ్యక్తి మరో పెళ్లి చేసుకున్నాడు. అమరేందర్ హైకోర్ట అడ్వకేట్ గా గుర్తించారు. అమరేందర్ తండ్రి మహేందర్ రిటైర్డ్ జడ్జిగా పోలీసులు గుర్తించారు. వంశాభివృద్ధి కోసం మగపిల్లాడు లేడంటూ రెండో పెళ్ళి చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అమరేందర్ భార్య పదే పదే ఆడపిల్లలకు జన్మనిస్తుందని తెలుసుకుని, ఆమెకు బలవంతంగా నాలుగుసార్లు అబార్షన్ చేయించాడని పోలీసులు తెలిపారు. వీరికి ఇప్పటికే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు నేరమైనప్పటికీ అక్రమంగా స్కానింగ్ చేసి ఆడపిల్ల పుట్టబోతోందని గుర్తించిన అమరేందర్ 4 సార్లు అబార్షన్లు చేయించుకున్నట్లు తేలింది. అయితే ఆమెకు ఏ డాక్టర్ అబార్షన్ చేశాడు? లేక మాత్రలు ఎక్కడ వేసుకున్నాడు? అమరేందర్ తన భార్యకు అబార్షన్ చేయించడానికి ఎవరు సహకరించారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రాజకీయాల్లో జోక్యం కూడా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత అమరేందర్ తెలంగాణ రైతు రాజ్య సమితి (టీఆర్ఎస్) పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించుకున్నాడు.
ఇప్పటికే అమరేందర్ పై సరూర్ నగర్ మహిళా పీఎస్ లో కేసు నమోదైంది. అమరేందర్ బారినపడ్డ పలువురు బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలంటూ బాధితులు, అమరేందర్ భార్య వేడుకుంటున్నారు. అప్పటికే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నాడని అమరేందర్ చెప్పాడని భార్య వాపోయింది. నాలుగుసార్లు అమ్మాయిలని చెప్పి తనకు అబార్షన్లు చేపించాడని కన్నీరుమున్నీరయ్యింది. తనకు తెలియకుండా గతేడాది నవంబర్ లో సిద్ధిపేటలో రెండో పెళ్ళి చేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆడపిల్లలు పుట్టారని తనని వదిలించుకోవాలని చూస్తున్నారని, తనకు పిల్లలకు న్యాయం చేయాలని పోలీసులకు వేడుకుంది.
Thummala Nageswara Rao: అన్నం పెట్టే రైతులను కేంద్రం ఆదుకోవాలి.. లేదంటే మీకే నష్టం..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
-
Pawan Kalyan: ‘పవన్ కళ్యాణ్’ నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!