Traffic Diversion : హైదరాబాద్లో గణేష్ నిమజ్జన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
- గణేష్ నిమజ్జనం కోసం నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు
- సెప్టెంబర్ 5 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి అర్ధరాత్రి వరకు పరిమితులు
- కీలక జంక్షన్ల వద్ద వాహనాల మళ్లింపు – ప్రత్యామ్నాయ మార్గాలు సూచించిన పోలీసులు
- అవసరమైతే మాత్రమే నిమజ్జన ప్రాంతాలకు వెళ్లాలని విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Traffic Diversion : నగరంలో గణేష్ నిమజ్జన మహోత్సవాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. నేటి (ఆగస్టు 29) నుండి సెప్టెంబర్ 5 వరకు ఈ ఆంక్షలు కొనసాగనున్నాయి. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి అర్ధరాత్రి వరకు వాహన రాకపోకలపై పరిమితులు ఉండనున్నాయి. పోలీసుల ప్రకారం, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో భారీగా వాహనాల రాకపోకలు ఉండే అవకాశం ఉన్నందున మోటార్ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు.
“సుగాలి ప్రీతి తల్లి ఆరోపణలపై పవన్ కళ్యాణ్ స్పందన”
Also Read
- TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
- AV Ranganath : వివాదాల మధ్యే విధుల్లోకి రంగనాథ్.. ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ.!
- NIMS : నిమ్స్ ఘనత.. 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి.. సీఎం రేవంత్ ప్రశంసలు.!
- Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
ప్రధాన రూట్లపై ఆంక్షలు
సెయిలింగ్ క్లబ్ జంక్షన్, వీవీ విగ్రహం, తెలుగు తల్లి జంక్షన్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ ఎక్స్ రోడ్, నల్లగుట్ట బ్రిడ్జి, బుద్ధభవన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ను మళ్లించనున్నారు.
అప్పర్ ట్యాంక్బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ మీద అవసరాన్ని బట్టి వాహనాలను అడ్డుకోవచ్చు.
లిబర్టీ, ఖైరతాబాద్, సికింద్రాబాద్, పంజాగుట్ట వైపు వచ్చే వాహనదారులు కవాడిగూడ, బేగంపేట్, మినిస్టర్ రోడ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
వాహనదారులకు సూచనలు
నిమజ్జన కార్యక్రమాలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ నియమాలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకించి పీక్ టైమ్లో వాహనాలు తీసుకెళ్లేటప్పుడు ఆంక్షలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజలు గణేష్ నిమజ్జన ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను వినియోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు నగరవాసులకు “అవసరమైతే మాత్రమే నిమజ్జన ప్రాంతాలకు వెళ్లండి. ట్రాఫిక్ ఆంక్షలను గౌరవించండి. పోలీసులకు సహకరించండి” అని విజ్ఞప్తి చేశారు.
Vizianagaram News: హృదయవిదారక ఘటన.. తల్లికి పురుడు పోసిన కూతురు!
తాజావార్తలు
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Israel-Hamas War: ఆమె దగ్గరకే వెళ్లిపోయాడు.. మూడేళ్ల తర్వాత ఇజ్రాయెల్ ప్రేమికుడు తీవ్ర నిర్ణయం
-
Indian Origin Cricketer: ఆ క్రికెటర్కు బిగ్షాక్ ఇచ్చిన ఐసీసీ.. 8 ఏళ్లు నిషేధం..
-
TGSRTC Results : ఆర్టీసీ జాబ్స్ రిజల్ట్స్ విడుదల.. ఎంపికైన వారి లిస్ట్ ఇదే.!
-
E20 పెట్రోల్పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!