Hyderabad:కుటుంబం ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. శ్వేతా సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సరూర్ నగర్ పీఎస్ పరిధిలో ఇద్దరు పిల్లలతో సహా దంపతులు ఆత్మహత్యాయత్నం సంచలంగా మారిన విషయం తెలిసిందే.. బిల్లుల విషయంలో ఓ కాంట్రాక్టర్ మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు బాధితులు. బంధువుల ద్వారా సమచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరడంతో ప్రాణాపాయం తప్పింది.
అయితే.. సరూర్ నగర్ కుటుంబ ఆత్మహత్యయత్నం బాధితులు శశికుమార్ భార్య శ్వేతా తన ఆవేదన అధికారులకు వెల్లడించింది. దినేష్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు ఇవ్వకుండా మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తను, తన భర్త , ఇద్దరు పిల్లలు చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
దినేష్ రెడ్డి వద్ద ఎలక్ట్రికల్ సబ్ కాంట్రాక్టర్ గా తన భర్త పని చేస్తున్నాడని, 2019 ఫిబ్రవరి నెల నుండి దినేష్ రెడ్డి అనే వ్యక్తి మాకు డబ్బులు ఇవ్వడం లేదని కన్నీరుమున్నీరయ్యింది. సుమారు 2కోట్ల రూపాయలు వారికి ఇవ్వాలని తెలిపింది. డబ్బులు ఇవ్వమని కోరితే మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాడని వాపోయింది. చనిపోయే ముందు మేము చనిపోతున్నాము మా డబ్బులు మాకు ఇవ్వమని కోరిన చస్తే చావండి అని అన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు పిల్లలతో సహా మేము నిద్ర మాత్రలు వేసుకున్నామని తెలిపింది. దినేష్ రెడ్డి నుండి రావాల్సిన డబ్బులు వారికి ఇప్పించండి, న్యాయం చెయ్యండి అని కోరుతున్నామని పేర్కొంది.
బాధితుడు శశి కుమార్..పిల్లలు రఘు,వరుణ్
విటమిన్ టాబ్లెట్స్ వేసుకోండి అని మాకు 2 టాబ్లెట్స్ ఇచ్చారని బాధితుడు శశి కుమార్..పిల్లలు రఘు, వరుణ్ తెలిపారు. అవి వేసుకోగానే చేదుగా ఉండడంతో మేము వాంతులు చేసుకున్నాము. మేము ఆడుకునేందుకు హోటల్ కిందకి వెళ్లి వచ్చే లోపు అమ్మ, నాన్న బెడ్ పైన పడి ఉన్నారు. మాకు దినేష్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాలి. మా నాన్న అడుగుతుంటే బూతులు తిడుతున్నారు. మాకు న్యాయం చెయ్యండని శశికుమార్ పిల్లలు వేడుకున్నారు.
బాధితుడు శశికుమార్ బావమరిది సురేష్
దినేష్ రెడ్డి అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుండి మా కుటుంబాన్ని వేధిస్తున్నాడని బాధితుడు శశికుమార్ బావమరిది సురేష్ పేర్కొన్నారు. డబ్బులు అడిగితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని వాపోయాడు. మా బావ వాళ్ళు చివరిగా అడిగిన ఏమైనా చేసుకోండి అని మాట్లాడాడని ఆవేదన వ్యక్తం చేశాడు. అతని వెనుక రాజకీయ పలుకుబడి ఉందనే ధైర్యంతోనే.. తనని ఏమీ చేయలేమనే.. మా వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆత్మహత్య చేసుకుంటున్నామని మాకు ఫోన్ చేయడంతో భయంతో పోలీసులకు ఫిర్యాదు చేసామని బావమరిది సురేష్ తెలిపారు. పోలీసులు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ చేశారని దాంతో ప్రాణాప్రాయం తప్పిందని కన్నీరుమున్నీరయ్యాడు. ఇలా మళ్ళీ ఆత్మహత్యకు పాల్పడితే బాద్యులు ఎవరు? అని ప్రశ్నించాడు. వెంటనే దినేష్ రెడ్డి దగ్గర వున్న తమ డబ్బును .. తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!